breaking news
-
నాణ్యమైన విద్యుత్ అందించాలి
నెహ్రూసెంటర్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జె.నరేష్ సూచించారు. మహబూబాబాద్, కేసముద్రం సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం సేఫ్టీ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అందరూ పాటుపడాలన్నారు. క్రమంతప్పకుండా బిల్లులు చెల్లించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్స్ రవీందర్, సంజీవ్, ఉమా మహేశ్వర్రావు, వీరయ్య ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈలు విజయ్, సునీత, అకౌంట్ ఆఫీసర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
మహబూబాబాద్: నిష్పక్షపాతంగా లోక్సభ ఎన్ని కల విధులు నిర్వర్తించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్వ్యాస్ అధికారులకు సూచించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి ఆయన ఎన్నికల పోలింగ్ నిర్వహణ, విధులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా నితేష్వ్యాష్ మాట్లాడుతూ.. అధికారులు చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్ యూనిట్లు, ఎఫ్ఎల్సీ, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వందశాతం ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలన్నారు. డబ్బు, మద్యం, గిఫ్ట్ల పంపిణీ జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సీ విజిల్ యాప్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వీసీలో ఆర్వో, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ప్రధాన పరిశీలకులు రచిత్రాజ్, వ్యయ పరిశీలకులు రమాకాంత్ ద్రుపాటి, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
కేసీఆర్ రోడ్ షో విజయవంతం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో విజయవంతమైందని, తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ధీమా వ్యక్తం చేశారు. మానుకోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, కేసీఆర్ను కావాలనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఈసీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ క్రేజ్ తగ్గదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు ఆ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో మానుకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. మానుకోటలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు అశించిన దాని కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, భరత్కుమార్ రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత -
అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్ల పరిశీలన
మహబూబాబాద్: మానుకోట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల రిజిస్టర్లను పరిశీలనకు తీసుకురావాలని ఆర్వో, కలెక్టర్ అద్వైత్మార్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలను ఈ నెల 3న మొదటిసారి వ్యయపరిశీలకులు ఉమాకాంత్ ద్రుపాటి పరిశీలిస్తారని తెలిపారు. అలాగే 7న, 11వ తేదీన సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్లు వ్యయ రిజిస్టర్లతో హాజరుకావాలన్నారు. హాజరుకాని పక్షంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్చార్జ్ డీపీఆర్వోగా ప్రేమలతమహబూబాబాద్: జిల్లా ఇన్చార్జ్ డీపీఆర్వోగా బి.ప్రేమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రేమలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం 10గంటలకు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నర్మద గురువారం తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీ సభ్యులు సకాలంలో సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలి గార్ల: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని మహబూబా బాద్ డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన మద్దివంచ గ్రామంలో ఆయన ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికలు జరిగే సమయంలో పార్టీల నాయకులు ఎలాంటి గొడవలకు పోవద్దన్నారు. సదస్సులో గార్ల బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై జీనత్కుమార్, వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాసరావు, నాయకులు గౌని భద్రయ్య, రాగం రమేష్, గౌని మల్లేశం, బిక్షమయ్య, జనార్దన్, లోకేష్, మాజీ సర్పంచ్ బాబూరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎదుట రెండు వర్గాల ఘర్షణచిన్నగూడూరు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని విస్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం విస్సంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు ఎమ్మె ల్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచా రం ఇవ్వట్లేదని వివాదం నెలకొంది. ఈక్రమంలో ఎమ్మెల్యే ఎదుటే ఇరువర్గాల నాయకులు ఘర్షణ పడ్డారు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో ఘర్షణ సద్దుమణిగింది. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 4వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సమ్మెట సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు వివరాల కోసం కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించాలిమహబూబాబాద్ అర్బన్: విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజెపీ, బీఆర్ఎస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజేఎస్ పార్లమెంటరీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. మతం పేరుతో ప్రజలను విభజించే నైతికత ఎవరికి లేదని, పదేళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు గుర్తు వచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రాజాస్వామిక వ్యవస్థలు కుప్పకూలిపోయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్కు టీజేఎస్ మద్దతు తెలుపుతుందని, మానుకోట అభ్యర్థి పోరి క బలరాంనాయక్ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు బైరి రమేశ్, గోపాగాని శంకర్రావు, పల్లె వినయ్, మహబూబాబాద్ పార్లమెంటరీ నాయకులు మల్లెల రామనాథం, పిల్లి సుధాకర్, ఆరుద్ర పరమాత్మ చారి, ఇరుగు మనోజ్, ఖాజాపాషా, రాజు, శంకర్, యాకూబ్ ఉన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019