Sakshi News home page

నిజాయితీకి మారుపేరు నారాయణస్వామి

Published Tue, May 7 2024 1:10 PM

నిజాయితీకి మారుపేరు నారాయణస్వామి

వెదురుకుప్పం : ‘అతనెవరో థామస్‌ అట..టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి...నేనింతవరకూ చూసింది కూడా లేదు..రావడం.. తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు... నిజాయితీకి మారు పేరు మా తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామిని, నన్ను నిత్యం ఆడి పోసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు...నేనొక్కటే చెబుతున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలే తరిమికొడతారు’ అని వైఎస్సార్‌సీపీ గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని ఎనమలమంద గ్రామంలో ఎన్నికల ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు. నీతిగా రాజకీయాలు చేసిన తన తండ్రిని అవినీతి పరుడు అంటూ సంస్కారం లేని వ్యక్తులందరూ విమర్శలు చేయడం బాధేస్తుందన్నారు. కష్టానికి నిదర్శనం మానాన్న... విలువ తెలిసిన వ్యక్తిగా మానాన్న పేద ప్రజల గుండెల్లో ఉన్నారు.. నేను ఎక్కడికెళ్లినా మన అన్న నారాయణస్వామి కుమార్తె అంటూ అక్కున చేర్చుకుంటున్నారు. అలాంటిది ఓ మహిళ అనే ఇంగితం కూడా లేకుండా థామస్‌ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం చేయదలచుకున్నారో అది చెప్పుకోవాలి కానీ, మమ్మల్ని చులకన చేసి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. క్రిమినల్‌ కేసులున్న వ్యక్తి కూడా తమపై నిందలు వేయడం దారుణమన్నారు. టీడీపీ అభ్యర్థి థామస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Advertisement

homepage_300x250