Sakshi News home page

‘ఆయుష్మాన్‌ భారత్‌’తో వైద్య సేవలు సులభం

Published Tue, May 7 2024 1:05 PM

‘ఆయుష్మాన్‌ భారత్‌’తో వైద్య సేవలు సులభం

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (అభ) ద్వారా దేశవ్యాప్తంగా వైద్యసేవలను సులభంగా పొందవచ్చని డీఎంహెచ్‌ఓ ప్రభావతీదేవి తెలిపారు. గురువారం చిత్తూరులోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అభ డిజిటలైజేషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్మాన్‌భారత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ వివరాలను డిజిటలైజేషన్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు హర్షవర్థన్‌, సుదర్శన్‌, జార్జ్‌, గుణశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250