సచివాలయానికి వెళితే బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశాం అని చెప్పారు. బ్యాంకుకు వెళితే నగదు జమ కాలేదు అని చెబుతున్నారు. ఇంతకీ నాకు రావాల్సిన డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. చంద్రబాబునాయుడు మాకు పింఛన్లు ఇవ్వకుండా ఇలా చేస్తున్నాడు. మాలాంటి వాళ్ల ఉసురు ఆయనకు తప్పకుండా తగులుతుంది. ఇంతకీ నాకు రావాల్సిన పింఛన్ ఎక్కడకు వెళ్లి తీసుకోవాలో అర్థం కావడం లేదు. చంద్రబాబు లాంటి వాళ్ల కారణంగా మాలాంటి ముసలోళ్లు ఇబ్బంది పడుతున్నారు.
– చెంగమ్మ, గుడిపాల
మా ఉసురు తగులుతుంది
ఐదేళ్లుగా ఇంటికి వచ్చి వలంటీర్లు పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు రెండు నెలలుగా టీడీపీ వాళ్ల వల్ల సకాలంలో పెన్షన్ అందడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ డబ్బుల కోసం పంచాయతీ కార్యలయాల వద్ద కాపు కాసి ఉండి తీసుకునే వాళ్లం. సమయానికి తిండి లేక ఇబ్బందులు పడ్డాం. జగన్ రాకతో మా బతుకులు గాడిలో పడ్డాయని సంతోషంగా ఉంటే మళ్లీ చంద్రబాబు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మా ఉసురు ఆయనకు తప్పకుండా తగులుతుంది.