పెద్దపంజాణి: మండలంలోని ముత్తుకూరు పంచాయతీ పరిధిలో గల పోలేపల్లి, బ్రాహ్మణపల్లి, నెర్ణిపల్లి, ముత్తుకూరు గ్రామాలకు చెందిన సుమారు 70 కుటుంబాలు, అలాగే నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లావారిపల్లికి చెందిన 40 కుటుంబాల టీడీపీ నాయకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
మేలు చేశాం.. మరోసారి గెలిపించండి
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య సాగే యుద్ధం వంటిదని, పేదల పక్షాన నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వెంకటేగౌడ, రెడ్డెప్ప ప్రజలను కోరారు. మంగళవారం మండలంలోని ముత్తుకూరులో పార్టీ శ్రేణులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారని, ఆయన మాయమాటలు, బూటకపు హామీలను నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలన్నా, సక్రమంగా పథకాలు అందాలన్నా అందరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రెడ్డెప్పను గెలిపించాలని అభ్యర్థించారు.
వైఎస్సార్సీపీలోకి మార్కెట్ శేఖర్..
చిత్తూరు కార్పొరేషన్: టీడీపీ నాయకులు మభ్యపెట్టి పార్టీ కండువా కప్పారని, తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చినట్లు స్థానిక కూరగాయల మార్కెట్ శేఖర్ తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రలోభాలకు లొంగవద్దని హితువు పలికారు.
వైఎస్సార్సీపీలోకి మాజీ జెడ్పీటీసీ కుమారుడు
నిండ్ర : మండలంలోని అత్తూరు దళితవాడకు చెందిన టీడీపీ మాజీ జెడ్పీటీసీ దివంగత దొరస్వామి కుమారుడు ఆరె రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అత్తూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏలుమలై, సచివాలయ కన్వీనర్ మునిరాజ్, బూత్ కమిటీ సభ్యులు బాషా, నాగరాజు ఆధర్యంలో మంగళవారం మంత్రి నివాసంలో మంత్రి ఆర్కే రోజా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మంత్రి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కుటుంబంతో సహా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వెంకటేగౌడ, రెడ్డెప్ప