breaking news
-
వనపర్తి
శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024వివరాలు IIలో uపలు మండలాల్లో రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు ● ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం ● తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన 45 డిగ్రీలు దాటితే.. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అత్యధికంగా 45.1 డిగ్రీలు, చిన్నచింతకుంట 45.0, నారాయణపేట జిల్లా కృష్ణాలో 45.2, ధన్వాడలో 45.1, కొత్తపల్లి మండలంలో 45, గద్వాల జిల్లాలో వడ్డేపల్లి 45.7, అయిజ 45.2, అలంపూర్ 45, నాగర్కర్నూల్ జిల్లాలో వంగూరు, కొల్లాపూర్ 46.0, వెల్దండ 45.4, కల్వకుర్తి 45.0 డిగ్రీలతో రెడ్ అలర్ట్ చేరుకున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మండుటెండలో పనిచేసే కూలీలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని నిపుణులు సూచిస్తున్నారు. దాహంతో సంబంధం లేకుండా రోజంతా తగినంత నీరు, నిమ్మకాయ నీరు, మజ్జిగ లాంటి ద్రావణాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు. జో. గద్వాల జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు వడ్డేపల్లి 45.7 అయిజ 45.2 అలంపూర్ 45.0 ఇటిక్యాల 44.9 ధరూర్ 44.8 వనపర్తి జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు మదనాపురం 44.8 ఖిల్లాఘనపూర్ 44.6 కొత్తకోట 44.5 పాన్గల్ 44.2 గోపాల్పేట 44.0న్యూస్రీల్ -
5న రాహుల్గాంధీ రాక
ఎర్రవల్లిచౌరస్తా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న ఎర్రవల్లి మండలకేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీచైర్పర్సన్ సరిత గురువారం సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఎర్రవల్లిలో లక్షమందితో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినట్లుగానే కేంద్రంలో కూడా అధికారం చేపట్టేలా దేశవ్యాప్తంగా చేపట్టనున్న సంక్షేమ పథకాలతో పాటు ఐదు గ్యారంటీల గురించి రాహుల్ ప్రకటిస్తారని చెప్పారు. అలాగే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే వివిద అభివృద్ధి గురించి సీఎం రేవంత్ వివరిస్తారని తెలిపారు. సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లి చౌరస్తాలో భారీ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించిన సంపత్కుమార్, మల్లు రవి -
పోలింగ్ రోజున సెలవు
● జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలకు ముందురోజు నుంచే సెలవు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పోలింగ్ రోజున సెలవు మంజూరు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫెసిలిటేషన్ సెంటరుకు వచ్చి ఓటు వేసేందుకు ఉద్యోగికి ఒకరోజు ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బీర్లు.. నో స్టాక్
15 రోజుల నుంచి తీవ్రమైన కొరత మహబూబ్నగర్ క్రైం: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,02,961 కాటన్ల బీర్ల విక్రయాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు ఇటీవల ప్రొడక్షన్ సక్రమంగా లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇప్పటికే జిల్లాలో చాలావరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే బీర్లకు డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పుడే కొరత తలెత్తడంతో ఇటు మందుబాబులు, అటు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో–స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో స్టాక్ వచ్చిన పది నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. తిమ్మాజిపేట, కొత్తకోట డిపోల నుంచి ఒక్కో దుకాణానికి 2–5 కేసుల వరకు మాత్రమే బీర్లు ఇస్తున్నారు. ఇచ్చిన స్టాక్ నిమిషాల వ్యవధిలో అయిపోవడంతో కష్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్కు తగ్గట్టుగా బీర్లు లేకపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. విపరీతంగా పెరిగిన ఎండలకు తోడు ఇటీవల లారీల సమ్మె జరగడంతో బీర్ల సరఫరా, ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటి అక్కడక్కడ కొంత వరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. నో స్టాక్ బోర్డులు ఒక్క ఏప్రిల్లోనే ఉమ్మడి జిల్లాలో 4,02,961 కాటన్లవిక్రయం ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఎకై ్సజ్ అధికారులు ఉత్పత్తి తక్కువ కావడం వల్లే.. గతంలో ప్రతి ఏడాది వేసవి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో ఓవర్ టైం పనిచేసి బీర్లు అధికంగా ఉత్పత్తి చేసి స్టాక్ చేసేవాళ్లు. ఈసారి అలా చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడింది. ఈ నెల చివరి నాటి వరకు జిల్లాలో బీర్ల కొరత ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. – విజయ్భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, మహబూబ్నగర్ -
మరుగుదొడ్లకు తాళాలు..
నాలుగేళ్ల కిందట ప్లాట్ఫాం ఒకటి, రెండుపై రూ.15 లక్షలు వెచ్చించి నిర్మించిన నాలుగు మరుగుదొడ్లు అన్ని వసతులతో నిర్మించారు. కానీ వీటికి తాళాలు వేసి ఉండటంతో వృథాగా మారాయి. మరుగుదొడ్డి తాళం చెవి విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ వద్ద అందుబాటులో ఉన్నాయంటూ స్టిక్కర్లు అతికించారు. అది కూడా ఆంగ్లంలో రాసి ఉండటంతో నిరక్షరాస్యులకు అర్థం కావడం లేదు. మహిళలు యువకులు స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి తాళం చెవి ఇవ్వమని అడగలేకపోతున్నారు. ప్రయాణికుల ఒత్తిడి మేరకు స్టేషన్ ప్రధాన కార్యా లయం పక్కనున్న ఒక మరుగుదొడ్డిని వాడు కునే అవకాశం కల్పించారు. అత్యవసర సమయంలో కొందరు ప్రయాణికులు స్టేషన్ వెలుపల ఉన్న ముళ్ల పొదల్లోకి వెళ్తున్నారు. స్టేషన్ ప్రధాన కార్యాల యం పక్కనే ఉన్న ప్రయాణికులు వేచి ఉండే గదికి కూడా తాళం వేశారు. రెండో ప్లాట్ఫాంపై షె డ్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ, వర్షంలో రైళ్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019