Sakshi News home page

adsolute video ad after first para

కణితి మాంసం స్వాధీనం.. ఒకరి అరెస్టు

Published Thu, May 2 2024 1:55 PM

కణితి మాంసం స్వాధీనం.. ఒకరి అరెస్టు

మైదుకూరు : కణితి మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్టు మైదుకూరు అటవీ రేంజ్‌ అధికారి ప్రణీత్‌రావు మంగళవారం తెలిపారు. దువ్వూరు మండలం నీలాపురం బీట్‌ పరిఽధిలో పాయ ప్రదేశంలో మినుము పంట రక్షణ కోసం మండలంలోని పెద్ద సింగనపల్లెకు చెందిన కొర్రా రామచంద్రారెడ్డి విద్యుత్తు తీగ కంచెగా వేసినట్టు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. సోమవారం సాయంత్రం రిజర్వ్‌ ఫారెస్టులోని కణితి విద్యుత్‌ కంచెకు తగిలి మృతి చెందిందన్నారు. గస్తీలో ఉన్న వనిపెంట రేంజికి చెందిన ఎఫ్‌ఎస్‌ఓ పీపీ.సుబ్బరాయుడు, ఎఫ్‌బీఓ సుచరిత విచారించి కంచె వేసిన రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి వద్ద కణితి మాంసం, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితున్ని మంగళవారం మైదుకూరు కోర్టుకు హాజరుపరిచినట్టు తెలిపారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250