Sakshi News home page

adsolute video ad after first para

అప్పారాంపల్లెలో 25 కుటుంబాల చేరిక

Published Thu, May 2 2024 1:55 PM

అప్పారాంపల్లెలో  25 కుటుంబాల చేరిక

కమలాపురం : మండలంలోని అప్పారాంపల్లెకు చెందిన సందాప్రసాద్‌రెడ్డితో సహా 25 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సందా ప్రసాద్‌రెడ్డి, వీర నారాయణరెడ్డి, కిట్టయ్య, సుబ్బరాయుడు, శివారెడ్డి, శంకరయ్య, రామ చంద్రారెడ్డి, అయ్యవారు రెడ్డి, జల్తర్‌, తిరుపతిరెడ్డి, బొంబాయి, నారాయణరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డితో సహా 25 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులైన రవీంద్రనాథ్‌ రెడ్డి, అవినాష్‌రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250