Sakshi News home page

adsolute video ad after first para

ప్రాణదానం

Published Fri, Apr 19 2024 1:30 AM

- - Sakshi

మె పేరు వైశ్యరాజు శాంత లక్ష్మి. నరసన్నపేటలోని కలివరపుపేట. భర్త లేరు. ఇద్దరు పిల్లలను తన రెక్కల కష్టం మీదనే పెంచుతున్నారు. అమ్మా యికి వివాహమైంది. కుమారుడు చేతికి అందివచ్చాడు. ఇప్పటికైనా కాసింత విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. కానీ అప్పుడే ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకింది. క్యాన్సర్‌ చికిత్స అంటే సాధారణ విషయం కాదు. దీంతో ఆమె ప్రాణాల మీద ఆశ వదిలేశారు. ఇంత లో ఆ వీధి వలంటీర్‌ ఆమె విషయాన్ని తెలుసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్తే అన్ని పరీక్షలు చేశారు. కీమో థెరపీ కూడా చేశారు. ఆపరేషన్‌ నిర్వహించి 8 నెలలవుతోంది. ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే అది ఆరోగ్య శ్రీ పథకం పుణ్యమేనని ఆమె చెబుతున్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250