కిడ్నీ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఓ వ్యక్తికి ఉచితంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. నందిగాం మండలం కణితిఊరు గ్రామానికి చెందిన పాలవలస లక్ష్మణరావు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అపెండిక్స్గా గుర్తించి సకల సౌకర్యాల నడుమ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత చక్కగా చూసుకుంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.20వేలు ఖర్చవుతుందని, ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, పేదలు వినియోగించుకోవాలని కోరారు.
తాను మరణించి..
మరో ఐదుగురికి బతుకునిచ్చి పొందూరు: మరణించినా సంపూర్ణ అవయవదానంతో చిరంజీవిగా నిలిచారు పొందూరుకు చెందిన వెంకుమహంతి శ్రీనివాసరావు(54). ఆయన విజయనగరం జిల్లాలో ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెల అధిక రక్తపోటు కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో విశాఖపట్నంలోకి విమ్స్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఇంతటి బాధను దిగమింగుకుని తన భార్య సునీత, కుమారుడు సంపూర్ణ అవయవదానానికి అంగీకరించారు. కళ్లు, కిడ్నీలు, కాలేయం, గుండె తదితర అవయవాలను ఐదుగురు వ్యక్తుల కోసం ఆస్పత్రులకు తరలించారు. దీనికి అధికారులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశా రు. శ్రీనివాసరావు మృతిపై పొందూరు శిష్టకరణ సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
36 రోజులకు రూ.31.85 లక్షలు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీల కానుకల ద్వారా రూ.31,85,917 మేరకు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ/డిప్యూటీ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలియజేశారు. ఈమేరకు గురువారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం అనివెట్టి మండపంలో నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి గురువారం వరకు మొత్తం 36 రోజులకు హుండీల్లో లభించిన ఆదాయాన్ని లెక్కించగా.. నగదు రూపంలో రూ.30,74,034, చిల్లర రూపంలో రూ.1,11,883 వరకు లభించింది. అలాగే 24 గ్రాముల బంగారం, వెండి 1 కేజి 470 గ్రాముల వస్తువులతో పాటు పలు దేశాల కరెన్సీ కూడా కానుకల రూపంలో లభించాయి. జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపు ప్రక్రియలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు ద్వారపు అనూరాధ, ఎన్.కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, జిల్లా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ రోజున ది వ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామ ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన వీల్చైర్లను నియోజకవర్గాల వారీగా పంపిణీ చేశారు. 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ అద్దాలు (భూతద్దాలు) 1700 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ ఎం.గణపతి రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు.