Sakshi News home page

adsolute video ad after first para

టీడీపీకి ఓట్లేస్తే చీకటి రోజులు తప్పవు

Published Thu, Apr 18 2024 11:40 AM

ఎమ్మెల్యే రామిరెడ్డిని సత్కరిస్తున్న ముస్లింలు  - Sakshi

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి: ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే చీకటి రోజులు తప్పవు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్‌లో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ స్థాపించిన నాటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారన్నారు. 2019లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఆయన రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కర్నూలు వంటి కీలక స్థానాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. అదే విధంగా కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులు, స్థానిక సంస్థల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాలు, హజ్‌ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. చంద్రబాబు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో షేక్‌ నాయబ్‌ రసూల్‌, మొగల్‌ సలీం బేగ్‌, మొగల్‌ రహీం బేగ్‌, పఠాన్‌ నవాజ్‌ ఖాన్‌, షేక్‌ ఫీర్‌ మహమ్మద్‌, నాయబ్‌ రసూల్‌, షేక్‌ అబ్దుల్‌, నాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250