Sakshi News home page

adsolute video ad after first para

వలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు

Published Thu, Apr 18 2024 11:40 AM

వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి  - Sakshi

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: ‘చంద్రబాబు నాయుడు వలంటీర్లపై కక్ష కట్టాడు. వారు సంక్షేమ పథకాలు, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు ఇవ్వకుండా తన మనుషుల ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని 200 మంది వలంటీర్లు బుధవారం తమ పోస్టులకు రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రజల మనిషి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం తమవంతు కృషి చేస్తామని వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సేవ చేసే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ మోర్ల మురళి, నాయకుడు కోడూరు మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250