భారత టీ20 వరల్డ్కప్ జట్టు.. ఇద్దరు విధ్వంసకర వీరులకు చోటు..?
Published
Wed, Apr 17 2024 7:38 PM
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత క్రికెట్ జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉంటాయని తెలుస్తుంది.
ప్రముఖ వార్త సంస్థ కథనం మేరకు.. భారత సెలెక్టర్లు 20 మందితో కూడిన భారత జట్టును ఇదివరకే ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా.. ఐదుగురు స్టాండ్ బైలు అని తెలుస్తుంది. అందరూ ఊహించిన విధంగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. సీనియర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారని సమాచారం.
ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు విధ్వంకర వీరులు శివమ్ దూబే, రింకూ సింగ్లు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకన్నారని తెలుస్తుంది. భారత వరల్డ్కప్ జట్టుపై ఇది కేవలం ప్రచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలుడాల్సి ఉంది.