Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 7:50 PM

-

మండుటెండలోనూ అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గురువారం ప్రచారం ఉధృతం చేశారు. అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ప్రచారం నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని మైనార్టీలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహరనాయుడు ప్రచారం నిర్వహించారు.

Advertisement

homepage_300x250