Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న నష్టాలు.. స్టాక్‌మార్కెట్ల పతనం

Published Tue, Apr 16 2024 3:33 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 455 పాయింట్లు దిగజారి 72,943 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీసుజుకీ మినహా మిగతా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అందులో ప్రధానంగా ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. 

యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్‌ ఫండ్‌లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

adsolute_video_ad

homepage_300x250