Sakshi News home page

adsolute video ad after first para

Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్‌ ఆటోలు

Published Fri, Feb 2 2024 6:02 AM

Interim Budget 2024: RE startup ZERO21 launches Project Gagan for rapid adoption of E3Ws - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెన్యువబుల్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్‌ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్‌ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఎక్సే్చంజ్‌ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్‌ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్‌ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్‌ వివరించారు.

ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్‌ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ (ఆర్‌ఎస్‌ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్‌ క్యారియర్‌ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్‌ కిట్‌లను కూడా అందిస్తోంది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250