breaking news
-
కలువాయి: గురువారం ఉదయాన్నే బ్యాంక్ ముందు ఉన్న దివ్యాంగురాలు
మా లాంటి ముసలోళ్లపై ఎందుకు పగ వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛను ఇచ్చేవారు. చంద్రబాబు మాలాంటి వారిపై ఎందుకు పగ పెంచుకున్నాడో తెలియదు. గత నెలలో సచివాలయం కాడికి పోయి పింఛన్ డబ్బులు తెచ్చుకున్నాం. ఇప్పడు బ్యాంకుకు పోవాలని చెప్పారు. అక్కడికి వెళితే సాయంత్రం ఇస్తామన్నారు. బ్యాంకు దగ్గరకు పోయి వచ్చిన దానికి రూ.100 ఖర్చు అయ్యింది. మళ్లీ ఇంకో సారి పోవాలంటే మరో రూ.100 కావాలి. ఇలా పింఛనులో రూ.200 పోతే మిగిలిన దానితో మందులు, పూట గడవడం ఎలాగో తెలియడం లేదు. – జయమ్మ ఏరూరు, చిల్లకూరు -
బాబు వల్లే మాకు ఈ కష్టాలు
ప్రతినెలా ఒకటో తేదీనాడే వలంటీర్లు మా ఇళ్ల వద్దకొచ్చి పింఛన్ ఇచ్చేవారు. చంద్రబాబు, ఆయన అనుచరుల కారణంగా నేడు మేము నానా కష్టాలు పడుతున్నాం. ఈనెలలో మాకు పింఛను బ్యాంకు అకౌంట్లలో జమచేసినట్టు చెప్పారు. పింఛను కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ వయసులో మేము ఇలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం ఎంతో కష్టంగా ఉంది. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడో..? అర్థం కావడంలేదు. ఈ కష్టాలకు కారణమైన బాబుకు మా ఉసురు తగలక పోదు. – వీరదాసరి రమణమ్మ, కలువాయి భయమేస్తోంది ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్ష్న్ సొమ్ము ఇచ్చే వలంటీర్లను తీసేశారు. ఇప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లితే ఆ జనాన్ని చూస్తే భయమేస్తోంది. ఆ క్యూలో నిలుచుకునే ఓపిక కూడా లేదు. నిరుపేదలను కష్టపెట్టే వారికి మా గోడు తప్పక తగలుతుంది బాబు. – వెంకటాద్రి, పెట్లూరు, వెంకటగిరి మండలం -
No Headline
దివ్యాంగులు, పండుటాకులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు కక్షగట్టారు. కుట్రపూరితంగా వలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. దీంతో ఎన్నికల కమిషన్ వలంటీర్ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇంటికే చేరుతున్న పింఛన్ అందకుండా పోయింది. రెండు నెలల నుంచి పండుటాకులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. వీసీ ఆదేశాలతో గత నెలలో సచివాలయాల ద్వారా పింఛన్ నగదు పొందగా.. ఇప్పుడు బ్యాంక్కు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. తమపై కక్షగట్టి ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు తీరుపై అభాగ్యులు ఒంటికాలుతో లేస్తున్నారు. ‘మేం ఏం పాపం చేశామని.. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు’ టూ శాపనార్థాలు పెడుతున్నారు. – సాక్షి, నెట్వర్క్ -
విధులకు హాజరుకావాల్సిందే
తిరుపతి సిటీ: ఎన్నికల విధుల నిర్వహణలో పీఓ, ఏపీఓలు ప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన ప్రతి ఉద్యోగి హాజరు కావాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. గురువారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాలలో సమస్య ఏర్పడితే వెంటనే సెక్టోరల్ అధికారికి సమాచారం అందించాలని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి ఓటరు స్లిప్పులు బీఎల్ఓలకు అందజేశామని, వారు నిర్ణీత సమయంలోపు ఓటరుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రగిరి ఆర్ఓ నిషాంత్రెడ్డి, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. 92,79 శాతం మందికి పింఛన్లుతిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ 92.79 శాతం పూర్తయినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 69,522 మంది లబ్ధిదారులకు గాను 64,506 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రూ.20,21,73,000లకుగాను బుధ, గురువారాల్లో రూ.18,79,05,000 లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. శుక్రవారానికి వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. నేడు డయల్ యువర్ ఈఓ తిరుమల: డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలనా భవంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయన్నట్టు వెల్లడించింది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈఓ ఏవీ.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవని సూచించింది. భక్తులు 0877–2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,510 మంది స్వామివారిని దర్శించుకోగా 30,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.62 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
No Headline
ఏర్పేడు/రేణిగుంట: రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఐజర్లను నెలకొల్పుతున్నట్లు కేంద్రం 2014లో ప్రకటించింది. ఏర్పేడు సమీపంలోని మేర్లపాక రెవెన్యూ పరిధిలో 548 ఎకరాలు ఐఐటీ కోసం భూసేకరణ చేశారు. అలాగే ఐజర్ కోసం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలో 260 ఎకరాలు సేకరించారు. ఇదే అదునుగా 2015లో అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అడ్డదారులు ఎంచుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనయుడు బొజ్జల సుధీర్రెడ్డి రెచ్చిపోయారు. అప్పటి తహసీల్దార్ లక్ష్మీనరసయ్యతో కలసి దాదాపు 150 ఎకరాల భూమికి పట్టాలు లేకపోవడంతో అప్పటికప్పుడు పాత తేదీలతో నకిలీ పట్టాదార్ పాసుపుస్తకాలను తయారు చేశారు. ఇంకేముంది.. రూ.కోట్ల పరిహారం మొత్తాన్ని కాజేశారు. అప్పట్లో ఎకరా భూమికి రూ.10లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. ఈ కుంభకోణంలో జంగాలపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అన్నీ తానై వ్యవహరించారు. ఇలా అక్రమాలకు పాల్పడి అవినీతి సొమ్మును బొజ్జల సుధీర్రెడ్డికి ముట్టజెప్పినట్లు అప్పట్లోనే చెడ్డపేరు మూటగట్టుకున్నారు. దీంతో జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందడంతో అప్పటి తహసీల్దార్పై చర్యలు తీసుకున్నారు. అలాగే తొట్టంబేడు మండలంలో ఏర్పాటు చేసిన ఖజారియా పరిశ్రమకు కేటాయించిన భూములకు సంబందించి పొందిన పరిహారంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మన్నవరంలో ఆక్రమించి చదును చేసిన ప్రభుత్వ భూమి పవిత్ర పుణ్యక్షేత్రంలోని ప్రజలు నమ్మి 30 ఏళ్ల పాటు పాలించే అవకాశాన్ని కల్పించారు.. ఓటేసిన ప్రజలను నడిసంద్రంలో ముంచేసి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జాతీయ విద్యాసంస్థలు ఏర్పేడు ఐఐటీ, ఐజర్ భూసేకరణలో భాగంగా రైతులకు అందాల్సిన పరిహారాన్ని బినామీ పేర్లతో కొట్టేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ భూములపై కన్నేసి వందలాది ఎకరాలను తన అనుచరుల పేర్లతో పట్టాలు చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు.. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి. బినామీ పేర్లతో అన్యాక్రాంతం శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం, ఇనగలూరు, ఎంపేడు గ్రామాల్లో తన బినామీల పేర్లతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను బొజ్జల సుధీర్రెడ్డి కూడగట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు చేసుకుని పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడినట్లు అప్పట్లో జిల్లా అధికారులకు ఫిర్యాదులందాయి. ఆ భూములకు సంబంధించి పట్టాదార్ పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి పంటరుణాలు పొంది బ్యాంకులను బురిడీ కొట్టించారు. తొట్టంబేడు మండలంలో సైతం తన అనుచరుల పేర్లతో ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకుని వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఏర్పేడు మండలం కోబాక రెవెన్యూ పరిధిలో గోవు పోరంబోకు భూములను బొజ్జల సుధీర్రెడ్డి అనుచరులు అక్రమించి పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. అనేకమార్లు ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా ఆక్రమణదారులు ఈ భూములను వదిలిపెట్టలేదు. మళ్లీ బొజ్జల సుధీర్రెడ్డికి అధికారం ఇస్తే నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను వదిలిపెట్టడని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019