Sakshi News home page

adsolute video ad after first para

బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌కు కృషి చేస్తా

Published Sat, Apr 20 2024 1:15 AM

వర్నిలో మాట్లాడుతున్న సురేశ్‌ షెట్కార్‌  - Sakshi

రుద్రూర్‌: బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ అన్నారు. చందూర్‌, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ సర్వే చేయించి ఎస్టీమెట్‌ వేయించానని, ఆ తర్వాత ఎంపీగా వచ్చిన బీబీ పాటిల్‌ దాని గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ బాన్సువాడ సెగ్మెంట్‌ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇందూర్‌ చంద్రశేఖర్‌, పార్టీ మండలాల అధ్యక్షులు తోట అరుణ్‌కుమార్‌, సురేశ్‌బాబా, పుప్పాల శంకర్‌, షాహీద్‌, నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌

Advertisement

adsolute_video_ad

homepage_300x250