ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పండుగ వచ్చేది. ఇంటి వద్దకే వలంటీర్లు వచ్చి ఠంచన్గా పింఛన్ అందజేసేవారు. అవ్వాతాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేది. మందులకు, ఇతర ఖర్చులకు నెలంతా ఎవరి దగ్గర చేయిచాపాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఒకటో తేదీ వచ్చిందంటే పింఛన్ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలవుతోంది. గత నెలలో సచివాలయాలకు.. ఈ నెల బ్యాంకులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నారు.
● చంద్రబాబూ మాపై మీకెందుకు పగ
● వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి
కష్టాలు తెచ్చిపెట్టావు
● నెలనెలా ఇంటి వద్దే పింఛన్ తీసుకునే
వెసలుబాటు రద్దు చేయించావు
● నీవూ వద్దు.. నీ మోసపూరిత
హామీలూ వద్దు
● మండిపడుతున్న పింఛన్ లబ్ధిదారులు