Sakshi News home page

యువత పాత్ర కీలకం

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

నేను పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్‌ చేస్తున్నాను. 2023లో ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా దరఖాస్తును ఆమోదించారు. ఎపిక్‌ కార్డు కూడా వచ్చింది. మొదటి సారిగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి పాలకులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.

– వినీల భూపని, కృష్ణానగర్‌, కర్నూలు

Advertisement

homepage_300x250