Sakshi News home page

adsolute video ad after first para

పసిడి, వెండి దిగుమతికి అనుమతులు పొందిన బ్యాంకులివే

Published Fri, Mar 29 2024 2:50 PM

Banks Got Permissions To Import Gold By RBI - Sakshi

వచ్చే ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన బ్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించింది. 

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లు మనదేశంలోకి పసిడి, వెండి దిగుమతి చేసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. 

ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌లు బాంగారాన్ని మాత్రం దిగుమతి చేసుకోవచ్చు.

ఇదీ చదవండి..అలర్ట్‌.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు

Advertisement

adsolute_video_ad

homepage_300x250