Sakshi News home page

ఏవోబీలోకి మావోయిస్టులు?

Published Thu, Apr 18 2024 4:30 AM

Maoists into AOB - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుని షెల్టర్‌ కోసం వచ్చినట్లు అనుమానం

ఏవోబీ దండకారణ్యంలో జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు

సరిహద్దులో పోలీసులు అప్రమత్తం.. ఔట్‌ పోస్టుల్లో రెడ్‌ అలెర్ట్‌

సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌­గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురు­కాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్‌ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు­(ఏవోబీ)­లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తు­న్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్‌ చేప­ట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహ­ద్దులోని ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య ప్రాంతం మావో­యిస్టు పార్టీకి అడ్డాగా మారింది.

ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్‌ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యక­లాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీ­సు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయి­స్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మావో­యిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యు­లను కోల్పోయింది.

కాంకేరు జిల్లాలోని మాడ్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురు­కాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్‌ ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశా­లోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావి­స్తు­న్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావో­యిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది.

మరో­వైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామ­రాజు జిల్లా పో­లీ­సులు కూడా అప్రమత్తంగా ఉన్నా­రు. ఒడిశా పోలీ­సు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడు­తున్నారు. చింతూరుకు సరిహ­ద్దులోని ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. 

అప్రమత్తంగా ఉన్నాం
ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు, మావో­యిస్టుల మరణాలు తదితర పరిణా­మాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్‌ పోస్టుల పరి«ధిలో రెడ్‌ అలర్ట్‌ అమలులో ఉంది. – తుహిన్‌ సిన్హా, ఎస్పీ, పాడేరు 

Advertisement

homepage_300x250