
బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి నలంద యూనివర్సిటీ గుర్తింపుగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు.

నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని పేర్కొన్నారు.

ఈ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తోందని మోదీ వివరించారు.










