
నేటి తరం హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉన్నా తప్పే. లేకపోయినా తప్పే. నటి పార్వతీ నాయర్ది ఇదే పరిస్థితి.

అబుదాబిలో హైస్కూల్ వరకూ చదివిన ఈ బ్యూటీ ఆ తరువాత తన ఉన్నత విద్యను కర్ణాటకలో పూర్తిచేశారు.

ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతీ మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని గెలుచుకున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత 2015లో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రంలో అరుణ్విజయ్కు జంటగా నటించి గుర్తింపు పొందారు.

ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న ఈమె ప్రస్తుతం కథానాయకిగా నటించిన రూపం, ఆలంబనా చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

తాజాగా విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం గోట్ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటే పార్వతీ నాయర్ ఇటీవల కనిపించకుండా పోవడంతో అభిమానులు ఆమెకు ఏమైందోననే ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

దీంతో వారి ప్రశ్నలకు స్పందించే విధంగా పార్వతీమీనన్ తన గ్లామరస్ ఫొటోలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు.

అందులో తాను జీవించే ఉన్నానని, మీ ప్రేమతో కూడిన మెసేజ్లకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈమె కుటుంబం దుబాయిలో సెటిల్ అయ్యారన్నది గమనార్హం.













