
హీరోయిన్ దర్శ గుప్త తన 30వ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది.

ఇందుకోసం భారీ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెలబ్రిటీ మిత్రులను ఆహ్వానించలేదు.

అయినా అందరికీ ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ భలే నచ్చాయి.

ఎందుకంటే ఆమె తన పుట్టినరోజు నాడు అనాథాశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేసింది.

వారితో కలిసి కాసేపు కబుర్లు చెప్పి నవ్వించింది.

తనకు ఇలాంటివి కొత్తేం కాదు.

మధ్యే రోడ్డు పక్కన ఉన్న వృద్ధులకు అన్నం పొట్లాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసింది.

ఇంత అందమైన మనసు ఉన్న దర్శ గుప్తను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు.

ఈ తమిళ నటి రుద్ర తాండవం, ఓ మై ఘోస్ట్ అనే చిత్రాల్లో నటించింది.






