పదునెక్కిన ప్రచారం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రచారాలకు మరింత పదును పెట్టాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా ప్రచారానికి వస్తున్నారు. బీర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నిల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్రను ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించారు. ఇటీవలే రెండు రోజులు రోడ్షో నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్రావు శుక్రవారం నల్లగొండ పట్టణం, చండూరులో జరిగే రోడ్షోలలో పాల్గొంటారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లాలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండటగా, జాతీయ స్థాయి అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెల 6న నల్లగొండలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమావేశాలను నిర్వహించింది. వివిధ సామాజికవర్గాల వారితో సమావేశాలకు సిద్ధమవుతోంది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, నల్లగొండ నియోజకవర్గాల్లో యువత, అడ్వకేట్స్, వివిధ సామాజికవర్గాల వారితో సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు ఎంపీ అభ్యర్ధి కందూరు రఘువీర్రెడ్డి గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉత్తమ్కు అప్పగించారు. జానారెడ్డి కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ సామాజికవర్గాల వారీగా జనాలను కలుస్తున్నారు.
సభలు, సమావేశాల్లో బీజేపీ
బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా 6వ తేదీ రాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ రోడ్షోలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి నల్లగొండ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా, బీఆర్ఎస్ ఈసారైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో అధికార పార్టీపై అస్త్రాలు సందిస్తోంది. బీజేపీ మాత్రం రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలు, నరేంద్రమోడీ చర్మిషాను నమ్ముకొని నల్లగొండలో పాగా వేయాలని ముందుకు సాగుతోంది.ఉమ్మడి జిల్లాకు క్యూ కడుతున్న అగ్రనేతలు
ఫ సామాజిక సమీకరణలపైనా పార్టీల దృష్టి
ఫ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టిన బీజేపీ
ఫ సమావేశలకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్గెలుపు బాధ్యత జగదీష్రెడ్డిపై!
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి జగదీష్రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో నియోజక వర్గ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. బీర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన, బస్సు యాత్ర మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊపు వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని, కరెంటు పోతోందని, 5 ఎకరాల వారికి రైతు బంధు ఇవ్వడం లేదంటూ, రూ. 2 లక్షల రుణమాఫీ డిసెంబరు 9న ఎందుకు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, కరువు కాంగ్రెస్తో వచ్చిందంటూ నేతలు విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా సామాజికవర్గాల వారీగా ఓటర్లను కలుస్తూ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తోంది.