బాన్సువాడ: బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కండువా మార్చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని మాజీ ఎమ్మల్యే రవీందర్రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ చేరారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రధాన అనుచరుడు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు రమాదేవి, రుక్మిణి గైక్వాడ్, బాడి శ్రీనివాస్, అహ్మద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తనుయుల వ్యవహార శైలి నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్లో చేరిన నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్, నాయకులు మైలారం భాస్కర్రెడ్డి, అంజద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
breaking news
Breadcrumb
- HOME
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..
Published Tue, Feb 27 2024 12:48 AM
Related news
-
పిడుగుపాటుకు ఆవు మృతి
నవీపేట: పిడుగుపాటు కారణంగా మండలంలోని మోకాన్పల్లిలో ఆవు మృతి చెందింది. మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందిందని, దాని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మోతెలో విద్యుత్షాక్తో.. వేల్పూర్: మండలంలోని మోతెలో విద్యుత్షాక్తో ఆవు మృతి చెందింది. ఉరడి నవీన్ అనే రైతుకు చెందిన సోమవారం ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో మేతమేస్తుండగా షాక్ తగిలి మృతి చెందిందని మండల పశువైద్యాధికారి సంతోష్రెడ్డి తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపాడు. రోడు ్డప్రమాదంలో పీఆర్ ఏఈకి గాయాలు ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పీఆర్ ఏఈ పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట కార్యాలయంలో విధులను ముగించుకుని మెదక్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పిచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో.. ఎడపల్లి (బోధన్): మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు స్కూటీపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు నిజామాబాద్కు తరలించారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
డిచ్పల్లి: ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం బోల్తాపడింది. ఓవర్ లోడ్ కారణంగా లారీ ఎడవవైపు ఒరిగి బోల్తాపడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిపై ధాన్యం బస్తాలు పడకపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ అద్దాన్ని పగులగొట్టుకుని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు. సిరికొండ మండలం చీమన్పల్లిలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలను లోడ్ చేసుకుని నిజామాబాద్ శివారులోని రైస్మిల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఐడీసీఎంఎస్ సిబ్బందితో మాట్లాడి మరో లారీని రప్పించి ధాన్యం బస్తాలను తరలించారు. -
రాయిని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
● ఆరబోసిన ధాన్యం కుప్ప వద్ద ఘటన నవీపేట: రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పపక్కన పెట్టిన రాయిని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నవీపేట–నాగేపూర్ మధ్య బాసర రోడ్డుపై ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగేపూర్కు చెందిన నేతి సాయిలు(40) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై నవీపేటకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పకు అడ్డుగా పెట్టిన రాయిని ఢీకొట్టి బైక్ అదుపుతప్పింది. ఈ ఘట నలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్ద రు స్నేహితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యా రు. మృతుడికి భార్య వసంత, ఆరేళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కామారెడ్డి క్రైం: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో తాడ్వాయికి చెందిన మర్రి సాయిలు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం పరిధిలోని పొందుర్తి శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు పని నిమిత్తం ఆదివారం సాయంత్రం బైక్పై భిక్కనూరుకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా, పొందుర్తి సమీపంలోని లక్ష్మీనగర్తండా వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అకాల వర్షం.. అతులాకుతలం
● నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం ● నేలకొరిగిన భారీచెట్లు పిట్లం(జుక్కల్) : మండల కేంద్రంలో, చిల్లర్గి, సిద్దాపూర్, రాంపూర్, గౌరారం, కుర్తి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షంకు వరదనీరు రావడంతో వరిపంట ధాన్యం, జొన్నపంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారులు సిబ్బందికి, సహకార సంఘం అధికారులకు ధాన్యంపై కప్పడానికి కవర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు త్వరగతిన ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజాంసాగర్లో.. నిజాంసాగర్(జుక్కల్) : నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులకు ప్రజలు అతలాకుతలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపడ్డాయి. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. రోడ్లపైన ఆరబెట్టిన ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రామారెడ్డిలో.. రామారెడ్డి : ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో మండలంలో పలు చోట్ల చెట్లు నేలకొరకగా, ఇనుపరేకులు కింద పడిన ఘటనలు సోమవారం సాయంత్రం రాత్రి చోటుచేసుకున్నాయి. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో భారీ చెట్లు సైతం నేలకొరకగా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రామారెడ్డి ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. ఏఎస్సై రవీందర్, కానిస్టేబుల్ పవన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ పరిధిలో.. కామారెడ్డి రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మిద్దె ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దోమకొండలో విద్యుత్ సరఫరా బంద్ దోమకొండ : మండల కేంద్రంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా పిడుగు పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని బీబీపేట్ రోడ్డులో అయ్యవారి రామాచారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మంటలతో పూర్తిగా కాలిపోయింది, పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గండం తప్పింది. మంటలు వస్తున్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కరెంటు అధికారులకు ఫోన్తో సమాచారం అందించడంతో గంట సేపు కరెంటును నిలిపివేశారు. గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు పెద్దకొడప్గల్(జుక్కల్) : మండలంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు టీకారం తండాలో 30 రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు కొంత ఎండిపోగా, మిగితా పంట ఇలా అకాల వర్షానికి వర్షార్పణమైంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం దాదాపుగా కొట్టుకుపోయింది. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వర్షం నీటి నుంచి తీయడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణలో తరుచూ మార్పులతో ఆరిన ధాన్యం తూకంలో జాప్యం కారణంగా తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిర్ఫోర్స్ క్యాప్స్ అందజేత
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైందని ఎయిర్ఫోర్స్ అధికారులు సందీప్, అనిల్ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎయిర్స్ ఫోర్స్ అధికారులు నాలం సందీప్, అనిల్ గోస్వామిలు ఎయిర్ ఫోర్స్ క్యాప్, బ్రోచర్ను అందజేసి అవగాహన కల్పించారు. ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రాథమికంగా ఎన్సీసీ విద్యార్థులకు అదనపు అర్హతగా కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే.విజయ్కుమార్, క్రీడలు, యువజన జిల్లా అధికారి వై.దామోదర్రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎం రామస్వామి, సమన్వయకర్త ఎం చంద్రకాంత్, అధ్యాపకులు అనిల్కుమార్, చంద్రశేఖర్, ఆర్కే సీఈవో జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంకు స్వాగతం పలికిన చైర్పర్సన్ కామారెడ్డి టౌన్ : నిజామాబాద్లో సోమవా రం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ సభలో సీఎంను శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి కామారెడ్డి టౌన్ : దివ్యాంగులు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞా న్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. 270 సెల్ఫోన్ల రికవరీ బాన్సువాడ : బాన్సువాడ పోలీస్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీస్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 600 పైగా సెల్ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో ఇప్పటి వరకు 270 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఆయన అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీఈఐఆర్ ఆపరేటర్ రాజేష్ను సీఐ అభినందించారు.
Related News by category
-
కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ పరిశీలన
కామారెడ్డి క్రైం: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న కామారెడ్డిలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ రోడ్షో రూట్ మ్యాప్ను గురువారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, నల్లమడుగు సురేందర్ పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై స్థానిక నేతలకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు, నాయకులు పరికి ప్రేంకుమార్, జూకంటి ప్రభాకర్రెడ్డి, రామ్మోహన్, భూంరెడ్డి, లక్ష్మీనారాయణ, గైని శ్రీనివాస్, భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్వో మల్లికార్జున్ బాబు సూచించారు. గురువారం ఆయన అడ్లూర్, ఇస్రోజీవాడి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 28,189 మంది రైతుల నుంచి రూ. 342 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు రూ.235 కోట్లు చెల్లించామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
విధులను పారదర్శకంగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: లోక్సభ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఆదేశించారు. గురువారం ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో మాట్లాడారు. పోలింగ్ సన్నద్ధతపై సమీక్షించారు. కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ సింధు శర్మ, ఎన్నికల విభాగం అధికారులు ప్రేంకుమార్, సుమలత, సరళ, స్వప్న, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ -
ఆదుకున్నోళ్లకే ఓటు వేయండి
గాంధారి/తాడ్వాయి: ఆపదలో ఆదుకున్నవారికి, సంక్షేమ పథకాలు అందించిన వారికే ఓటు వేయాలని, అబద్ధాలు ఆడేవారికి ఓటు వేయొద్దని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కోరా రు. గురువారం గాంధారి, తాడ్వాయి మండలాల్లో నిర్వహించిన రోడ్షోలలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మె ల్యే జాజాల సురేందర్లతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అబద్ధాలు చెప్పి, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మర్చిపోయారన్నారు. బీబీ పాటిల్ పదేళ్లు ఎంపీగా ఉండి ఏ అభివృద్ధి చేయలేదని, సురేష్ షెట్కార్ కూడా జహీరాబాద్ ఎంపీగా పనిచేసి ఉద్ధరించింది ఏమీలేదని, వీరిద్దరూ దద్దమ్మలేనని ఎద్దేవా చేశారు. బీబీ పాటిల్ పార్టీని మార్చినంత మాత్రాన బీజేపీకి ఎవరూ ఓటు వేయరన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ..తనను పెద్ద మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మీ సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, తాడ్వాయి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ నర్సిములు, జెడ్పీటీసీ రమాదేవి, బీఆర్ఎస్ పార్టీ గాంధారి మండలాద్యక్షుడు శివాజీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు పెద్దబూరి సత్యం, సత్యం రావు, బలరామ్ నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే చర్యలు
కామారెడ్డి క్రైం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ హెచ్చరించారు. ఈ విషయమై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, విజిలెన్స్ బందాలు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణాతో పాటు స్టోరేజ్ పాయింట్లపైనా నిఘా పెట్టామని పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న చౌక ధరల దుకాణాలపైనూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 531.96 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు. సబ్స్టేషన్ తనిఖీ భిక్కనూరు: జంగంపల్లి, భిక్కనూరు, బస్వాపూర్లలోని విద్యుత్ సబ్స్టేషన్లను గురువారం ట్రాన్స్కో ఎస్ఈ రమేశ్బాబు తనిఖీ చేశారు. బస్వాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన 11 కేవీ ఫీడర్ను పరిశీలించారు. సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని, వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కారించాలని ఆదేశించారు. ఎస్ఈ వెంట ఏడీఈ కిరణ్, ఏఈ రామలక్ష్మి, సబ్ ఇంజినీర్ శివతేజ తదితరులు ఉన్నారు. మోదీ పాలనకు ప్రజల సంపూర్ణ మద్దతునిజాంసాగర్(జుక్కల్): మరోమారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకోసం ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ అన్నారు. గురువారం జుక్కల్ మండలంలోని కౌలాస్, వజ్రకండి, దోస్త్పల్లి, గుండూ ర్, పెద్దగుల్లా గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయ న్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ గడ్డపైన బీజేపీ జెండాను ఎగుర వేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార, మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, ఎంపీ సతీమణి అరుణపాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి● గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు ● రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ డిచ్పల్లి: ఎండలు అధికంగా ఉండటంతో ఉపాధి హామీ పనులు జరిగే చోట టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ సూచించారు. గురువారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్ చక్రవర్తి, డీఆర్డీవో సాయాగౌడ్తో కలిసి డిప్యూటీ కమిషనర్ ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని గ్రామాల్లో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలన్నాన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డ్రెయినేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు. డీఎల్పీవో శ్రీనివాస్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల ఎంపీడీవోలు రవీందర్, అనంత్రావు, బాలకృష్ణ, డీపీఎం నరహరి, ఏపీవో సుధాకర్రెడ్డి, టీఏలు అరుంధతి, ఉమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019