Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కూతురు సమాధి పక్కనే పడుకుని..

Published Wed, Mar 27 2024 12:03 PM

daughter died father safer - Sakshi

నారాయణపేట రూరల్‌: భౌతికంగా లేకపోయినా కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేని ఓ తండ్రి.. ఆమెను పూడ్చిన చోట రాత్రి పొద్దుపోయే వరకు ఉన్నాడు. వివరాల్లోకి వెళితే..నారాయణపేట జిల్లాకేం ద్రంలోని గోపాల్‌పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత సోమవారం హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్‌ట్యాంకు కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు.

కార్య క్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి రమేష్‌యాదవ్‌ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లారు. రాత్రి 11.30 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉండటంతో కుటుంబసభ్యులు, బంధువులు సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. 
 

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250