
●అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాలో వేసవి తాపం మొదలైంది. ఇప్పుడే ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మార్చి నుంచి వేసవి తీవ్రత మరింత పెరగనుంది. 10 సీపీడబ్ల్యు, 4896 పీడబ్ల్యుఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 మరమ్మతులకు గురయ్యాయి. రానున్న కాలంలో ఎండ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటితే మిగిలిన బోర్లలో కూడా నీళ్లు లేక తాగునీటి కష్టాలు మరింత అధికం కానున్నాయి. ఆర్డబ్ల్యుఎస్ అధికారులు ప్రత్యేకంగా తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక బోర్లకు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment