breaking news
-
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్లో ప్రస్తుతం ఎడెక్స్లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
Ayodhya Ram Mandir: ప్రపంచ నలుమూలల్లోనూ ఘనంగా ప్రాణప్రతిష్ట వేడుకలు
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు. పాకిస్తానీ ముస్లింలు సైతం.. అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ఏంజిలెస్లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు. -
వెబ్సైట్ల రారాజు గూగులే..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్ వెబ్సైట్కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వెబ్సైట్గా గూగుల్ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్ ట్రాఫిక్ ఉండే టాప్–10 వెబ్సైట్లలో నాలుగు గూగుల్కు చెందినవే. ► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్ వెబ్సైటే టాప్లో ఉంటూ వస్తోంది. అయితే టిక్టాక్ వెబ్సైట్ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్ను వెనక్కి నెట్టి టాప్లో నిలవడం గమనార్హం. ► పాపులర్ సైట్ల లిస్టులో యూట్యూబ్ 11వ స్థానంలో, అమెజాన్ 18వ, ఇన్స్ట్రాగామ్ 24వ, నెట్ఫ్లిక్స్ 25వ, వాట్సాప్ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్చాట్ 40వ, ట్విట్టర్ 45వ, లింక్డ్ఇన్ 68వ, జీమెయిల్ 79వ స్థానాల్లో ఉన్నాయి. -
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేసిన అంశాలు
న్యూస్కు సంబంధించి.. 1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్మెరైన్ 3. టర్కీ భూకంపం వ్యక్తులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్బాలర్) 2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు) 3. ఆండ్రూ టేట్ (కిక్బాక్సర్–సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్) సంగీత కళాకారులు 1. షకీరా (కొలంబియా సింగర్) 2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్) 3. జో జోనాస్ (అమెరికన్ సింగర్–నటుడు) సినిమాలు 1. బార్బీ 2. ఓపెన్ హైమర్ 3. జవాన్ క్రీడాకారులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్బాలర్) 2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్బాలర్) 3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్బాలర్) చనిపోయిన ప్రముఖులు 1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి) 3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్) -
300 ఏళ్లలో 200 కోట్లకు!
జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుంచి 50 ఏళ్లలోపే ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత? అలా పెరుగుతూనే పోతుందా? పెరగకపోగా, బాగా తగ్గుముఖం పడుతుందట. ఎంతగా అంటే, ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితమైపోతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది! ఇంకా మాట్లాడితే అంతకంటే భారీగా తగ్గినా ఆశ్చర్యం లేదంటోంది. కారణమేమిటో తెలుసా? ప్రాకృతిక విపత్తులనుకుంటున్నారా? కాదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శరవేగంగా తగ్గిపోతుండటమే! ఈ జాబితాలోని దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం... గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచి్చంది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటూ ఇటుగా ఉన్నది కాస్తా ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా! మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్ స్పియర్స్ లోతైన అధ్యయనం చేశారు. జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. ‘‘2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది’’ అని బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్–టీఎఫ్ఆర్)లో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు. పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్ వాదనను బలపరిచేలానే ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్లు ఎక్కువ సమయం పట్టనుంది! ఏమిటీ టీఎఫ్ఆర్...? ప్రతి మహిళ తన పునరుత్పత్తి సామర్థ్యం ముగిసేదాకా జీవించి, ఇతరత్రా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే కనగలిగిన పిల్లల సంఖ్యే టీఎఫ్ఆర్. జనాభాలో పెరుగుదల నమోదు కావాలంటే ఇది కనీసం 2 కంటే ఎంతో కొంత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం గ్లోబల్ టీఎఫ్ఆర్ 2.1గా ఉంది. 2026కల్లా ఇది 2కు తగ్గుతుందని అంచనా. అక్కణ్నుంచి స్థిరంగా తగ్గుతూ 2081 నాటికి ఏకంగా 1.4కు పడిపోనుంది. భారత్ విషయమే తీసుకుంటే, 2020 నాటికి టీఎఫ్ఆర్ 2కు దిగొచ్చింది. ప్రస్తుతం 1.8కి తగ్గిందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల్లో చాలావరకు టీఆఎఫ్ఆర్ ఇప్పటికే 2 కంటే దిగువకు వచ్చేసింది. గ్లోబల్ టీఎఫ్ఆర్ మున్ముందు ఏ 1.5 దగ్గరో స్థిరపడుతుందని, అంతకంటే తగ్గదని భావించినా జనాభా నానాటికీ తగ్గడమే తప్ప పెరిగే ప్రసక్తే ఉండదన్నది స్పియర్స్ అంచనా. ఆయన అధ్యయనంలో వెల్లడైన విశేషాలు... ► ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న 29 దేశాల్లో 2022 నాటికే 20 దేశాల్లో పునరుత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2 కంటే తగ్గింది. ►జనాభాపరంగా పెద్ద దేశాల్లో టీఎఫ్ఆర్ 2కు పైగా ఉండేవాటి సంఖ్య 2050కల్లా 3కు తగ్గుతుంది. అవి కాంగో, నైజీరియా, టాంజానియా. ►2081 నాటికి అన్ని దేశాల్లోనూ టీఆఎఫ్ఆర్ 2 కంటే తగ్గిపోతుంది. ►జననాల విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానం భారత్దే. దేశంలో ఏటా 2 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. ఈ శతాబ్దాంతానికల్లా అది ఏకంగా నాలుగో వంతుకు, అంటే 50 ►చైనాలో 85 లక్షలుగా ఉన్న వార్షిక జననాల సంఖ్య కేవలం శతాబ్దాంతానికి 12 లక్షలకు పరిమితం కానుంది. ►ఒకసారి తగ్గుముఖం పట్టాక జనాభా మళ్లీ పెరగాలంటే గ్లోబల్ టీఎఫ్ఆర్ 2 కంటే పెరగాలి. కానీ అందుకు అవకాశాలు చాలా స్వల్పం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ దేశంలోనూ అలా జరగలేదు. ►ఏ దేశంలో చూసినా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్న వారు పెరుగుతున్నారు. ►జీవన శైలి, ఆహారపుటలవాట్ల వంటి కారణాలతో పిల్లలు పుట్టని దంపతుల సంఖ్యా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో తగ్గిన పునరుత్పత్తి రేటు మన దేశంలో చూసుకుంటే 40 ఏళ్ల క్రితం కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పునరుత్పత్తి రేటు కనీసం 3 నుంచి 5 దాకా ఉండేది. ఇప్పుడది విపరీతంగా తగ్గిపోయింది. హరియాణానే తీసుకుంటే 5 నుంచి ఏకంగా 2కు తగ్గింది! ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్ (3), మధ్యప్రదేశ్ (2.6), యూపీ (2.7), రాజస్థాన్ (2.4), అస్సాం (2.1) మాత్రమే. పశి్చమబెంగాల్, తమిళనాడుల్లో 1.4 శాతం, మహారాష్ట్ర , పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో 1.5, కర్ణాటకలో 1.6, ఒడిశాలో టీఎఫ్ఆర్ 1.8గా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019