breaking news
-
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్లో జరుగుతాయి. -
ఆసియా చాంపియన్షిప్ పోటీలకు మీరాబాయి దూరం.. కారణం?
Asian Weightlifting Championships: భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో తాష్కెంట్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ పోటీలకు ఆమె దూరం కానుంది. అక్టోబర్లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మీరాబాయి తుంటికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె మరే టోర్నీ బరిలోనూ దిగలేకపోయింది. ఇక ప్రపంచ మాజీ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి మార్చిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. థాయ్లాండ్లో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగమైన ప్రపంచకప్ టోర్నీతో.. ఆమె పునరాగమనం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారియర్స్ ఘనవిజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 60–42తో గెలిచింది. వారియర్స్ తరఫున కెపె్టన్ మణీందర్ సింగ్ 15 పాయింట్లు, నితిన్ 14 పాయింట్లు స్కోరు చేశారు. ఈ గెలుపుతో వారియర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్; బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్ ఇదే
PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని అడగగా.. సింగిల్ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్లో మరో మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది. అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్ స్టార్.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్ సర్ కేవలం తన మెంటార్, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది. చదవండి: WC T20: గాయాలతో హార్దిక్ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు.. -
రీసైక్లింగ్కు దిక్సూచి.. టోక్యో ఒలింపిక్స్! ఈ విశేషాలు తెలుసా?
Pudami Sakshiga 2023: జపాన్ రాజధాని టోక్యోలో 2020లో జరిగిన ఒలింపిక్స్ రీసైక్లింగ్కే దిక్సూచిగా నిలిచిపోతాయి. ఒలింపిక్స్ నిర్వహణలో రీసైక్లింగ్తో జపాన్ చేసిన ఏర్పాట్లు పుడమి భవిష్యత్తునే నిలబెట్టాయి. ఒలింపిక్స్లో రీసైక్లింగ్ పోటీలు, పతకాలు ఉండకపోవచ్చు గాని, ప్రపంచాన్నే విస్మయపరచే రీసైక్లింగ్ ప్రాజెక్టులతో జపాన్ మహా విజేతగా నిలిచి, యావత్ ప్రపంచానికే పర్యావరణ సుస్థిర మార్గాన్ని చూపింది. టోక్యో ఒలింపిక్స్ను ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 300 కోట్ల మందికిపైగా జనాలు వీక్షించారు. వాళ్లు వీక్షించినది కేవలం క్రీడలను మాత్రమే కాదు, ఆ క్రీడల నిర్వహణలో ‘సూక్ష్మంలో మోక్షం’లా జపాన్ ప్రభుత్వం రీసైక్లింగ్తో చేసిన అద్భుతమైన ఏర్పాట్లను కూడా. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో పుడమికి హితవుగా ఉందో 2020 నాటి ఒలింపిక్స్ క్రీడల కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయి. ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమాల కోసం జపాన్ పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తునే ఉపయోగించుకుంది. ఎక్కువగా సౌర విద్యుత్తును, బయోమాస్ నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును ఈ క్రీడల కోసం ఉపయోగించుకోవడం విశేషం. కలపతో ఒలింపిక్స్ విలేజ్ అలాగే, ఒలింపిక్స్ విలేజ్ను స్థానిక అధికారులు విరాళంగా ఇచ్చిన కలపతో నిర్మించారు. ఇందులో వాడిన కలప తర్వాత రీసైక్లింగ్కు పనికొచ్చేదే! ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం నిర్మించిన వసతి భవనాలను, కార్యక్రమాలు మొత్తం ముగిశాక స్థానిక జనాభాకు నివాసాలుగా పనికొచ్చేలా నిర్మించారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్తో పోడియంలు మెడల్స్ ప్రదర్శన సమయంలో క్రీడాకారులు ఉపయోగించే పోడియంలను కూడా జపాన్ ప్లాస్టిక్ వ్యర్థాలతోనే తయారు చేసింది. ప్రతి పోడియంలోని చిన్న చిన్న ఘనాకారపు మాడ్యూల్స్ కూడా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారైనవే! ఒలింపిక్స్ పోడియంల తయారీకి జపాన్ 24.5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించింది. ఈ వ్యర్థాలను ప్రజల ఇళ్ల నుంచి సేకరించింది. ఒలింపిక్స్–2020 క్రీడోత్సవాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కగానే, జపాన్ దీనికోసం 2018 నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్కు పనికొచ్చేవే! ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ కొత్త జాతీయ స్టేడియం నిర్మాణానికి ఉపయోగించిన ప్లైవుడ్ ప్యానెల్స్ తయారీకి 87 శాతం కలపను ఆగ్నేయాసియా వర్షారణ్యాల నుంచి సేకరించారు. స్టేడియం పైకప్పుకు అమర్చిన సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్కు పనికొచ్చేవే! తక్కువ వనరులతో, తక్కువమంది మనుషులతో, తక్కువ గంటల్లో పుడమికి వీలైనంత తక్కువ హానిచేసే సాంకేతిక పరిజ్ఞానంతో ఒలింపిక్స్ వంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమేనని జపాన్ నిరూపించింది. రీసైక్లింగ్ టెక్నాలజీతో టోక్యో ఆవిష్కరించిన ప్రాజెక్టులన్నీ పుడమికి హితమైనవే! వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొన్నింటిని పరిశీలిద్దాం... అథ్లెట్ల కోసం కార్డ్బోర్డ్ మంచాలు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల విశ్రాంతి కోసం జపాన్ వినూత్నమైన ఏర్పాట్లు చేసింది. అథ్లెట్లు నిద్రించేందుకు ప్రత్యేకంగా హైరెసిస్టెంట్ కార్డ్బోర్డ్ మంచాలను ఏర్పాటు చేసింది. మంచాల తయారీకి ఎన్నిసార్లయిన రీసైక్లింగ్కు పనికొచ్చే పాలిథిన్ ఫైబర్లతో ఈ మంచాల తయారీ జరిగింది. శరీరానికి ఎగువ, మధ్య, దిగువ భాగాల్లో హాయినిచ్చే విధంగా మూడు వేర్వేరు విభాగాలతో ఈ మంచాలను రూపొందించారు. అంతేకాదు, ప్రతి అథ్లెట్ శరీరాకృతికి అనుగుణంగా వారు మాత్రమే ఉపయోగించుకునేలా ఈ కార్డ్బోర్డ్ మంచాలను, వాటిపై పరుపులను తయారు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు ముగిశాక కార్డ్బోర్డ్ను పేపర్ ఉత్పత్తులుగా, పరుపులను ప్లాస్టిక్ ఉత్పత్తులుగా రీసైకిల్ చేసే ఉద్దేశంతో జపాన్ ప్రభుత్వం వీటిని తయారు చేయించింది. పాత సెల్ఫోన్లతో పతకాలు! ఒలింపిక్స్ విజేతలకు పతకాలను ఆతిథ్య దేశమే ఇవ్వడం ఆనవాయితీ. ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే దేశాలు విజేతలకు ఇవ్వాల్సిన పతకాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటాయి. వాటికి కావలసిన కంచు, వెండి, బంగారు లోహాలను సమకూర్చుకుంటుంటాయి. జపాన్ మాత్రం పతకాల తయారీకి ప్రత్యేకంగా ప్రయాస పడలేదు. పతకాల తయారీ కోసం ప్రజల నుంచి వాడిపడేసిన పాత సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విరాళంగా సేకరించింది. వాటి నుంచి వేరుచేసిన లోహాలతోనే విజేతలకు పతకాలను తయారు చేయించింది. ప్రజల నుంచి విరాళంగా వచ్చిన వాటిలో ఏకంగా 60.21 లక్షల పాత నోకియా ఫోన్లు ఉండటం విశేషం. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్ రీసైక్లింగ్, రీయూజ్ సాంకేతికతకు జపాన్ అందించిన ఒలింపిక్స్ పతకాలు వినూత్న ఉదాహరణగా నిలుస్తాయి. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్! ఒలింపిక్స్లో కీలకం ఒలింపిక్ టార్చ్. ఒలింపిక్స్ టార్చ్ తయారీకి జపాన్ అల్యూమినియం వ్యర్థాలను ఉపయోగించింది. జపాన్లో 2011లో భూకంపం, సునామీ సంభవించాక అప్పట్లో నిర్వాసితుల కోసం నిర్మించిన తాత్కాలిక గృహాల నుంచి సేకరించిన అల్యూమినియం వ్యర్థాలనే ఒలింపిక్ టార్చ్ తయారీకి వాడారు. జపాన్ జాతీయ పుష్పం సాకురా చెర్రీ పూవును పోలినట్లు ఐదువిభాగాలుగా ముడుచుకున్న ఒలింపిక్ టార్చ్ను తయారు చేశారు. స్థానిక రవాణాకు రీసైకిల్ వాహనాలు జపాన్కు చెందిన వాహనాల తయారీ సంస్థ టయోటా డ్రైవర్లేని వాహనాలను త్వరలోనే రోడ్ల మీదకు తెచ్చేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తోంది. రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలే అదే స్ఫూర్తితో ఒలింపిక్స్ క్రీడాకారులను వసతి ప్రదేశం నుంచి క్రీడా స్థలికి, క్రీడా మైదానం నుంచి వసతి ప్రదేశానికి, టోక్యో నగరంలో వారు స్థానికంగా తిరగడానికి వీలుగా జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. పెద్ద తలుపులు, సులువుగా ఎక్కి దిగడానికి వీలుగా వీటి నిర్మాణం ఉండటంతో క్రీడాకారులు వీటిలో సౌకర్యవంతంగా ప్రయాణించగలిగారు. ఒలింపిక్స్ తర్వాత టోక్యోలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను 42 పెద్దస్థాయి క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లోనూ జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. -నరసింహారావు -
National Games 2022: తెలంగాణ నెట్బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్నగర్లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్లిఫ్టింగ్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్లో 84+క్లీన్ అండ్ జెర్క్లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019