breaking news
-
రేపు ‘బండి’ రైతుదీక్ష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్సైరన్ మోగించారు. అకా లవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సాగునీరందక పంటలు ఎండిపోతు న్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్కహామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ ‘రైతుదీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. మంగళవా రం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్లకల్లాల వద్ద బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రైతుల పక్షాన మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. కాగా, సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు ఆయన వినతిపత్రాలు అందించనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే ’’పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతో పాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ను ఏర్పాటు చేయాలి.’’ -
వరిసాగు ,రైతుల సమస్యలపై బండి సంజయ్ దీక్ష
-
తెలంగాణ: అటు కేబినెట్ భేటీ, ఇటు దీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కాగా, కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. నేడు టీజేఎస్ మౌన దీక్ష రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం టీజేఎస్ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని అఖిలపక్ష నాయకులు సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. (కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి) కేబినెట్ భేటీపై ఆసక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం కానుంది. మద్యం దుకాణాల పునరుద్ధరణ, లాక్డౌన్ సడలింపులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. (తెలంగాణలో మద్యానికి ఓకే!) -
భూమిపై హక్కు కోసమే దీక్ష
సాక్షి, మహబూబాబాద్ : ప్రతి రైతుకు పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసమే రైతు దీక్ష చేపట్టినట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట పట్టణంలో సోమవారం టీజేఎస్ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన రైతు దీక్షలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో వాస్తవ సాగుదారులకు అన్యాయం జరిగిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చరిత్రలో ఇంతకు ముందెన్నప్పుడూ జరగని పనిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో టీజేఎస్ పరిశీలనలో భూప్రక్షాళన మరిన్ని సమస్యలు సృష్టించి, రైతులను మరింత గందరగోళంలోకి నెట్టిందన్నారు. తమకు రెవెన్యూ అధికారులతో ఎలాంటి గొడవలేదని, గొడవంతా ప్రభుత్వం మీదనేన్నారు. లక్షల కొద్ది రికార్డుల్లో తప్పులు దొర్లడం, వాటి ప్రకారమే రైతుబంధు చెక్కులివ్వటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పాస్పుస్తకాల పంపిణీలో మొదటి రోజే 3,07,640 పుస్తకాల్లో తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి పంపారన్నారు. ఇక పంపిణీ చేసిన వాటిలో 9,11,241 తప్పులు దొర్లినట్లు అధికారికంగా గుర్తించారని తెలిపారు. ఇవేగాక వివిధ కారణాల రీత్యా అసలు పంపిణీకి నోచుకోనివి 7,39,680 పాస్ పుస్తకాలు ఉన్నాయన్నా రు. తప్పులు పడిన రికార్డులను సరి చేయించుకోడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తుందన్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోననే ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్లో సాంకేతిక లోపాలు ఉండడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక పక్క వర్షాలు పడుతుంటే, వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ‘నీ చెక్కులు వద్దు.. మా భూమి మాకుంటే చాలు, రికార్డులు సరి చేసి మా పాస్ బుక్కులు మాకిస్తే చాలు’ అనే స్థితికి రైతులు వచ్చారన్నారు. భూమి వెట్టి నుంచి విముక్తి చేసి, రైతు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు. ఇప్పుడు భూప్రక్షాళనలో పేదల భూములపై కాస్త బడా రైతుల పేర్లతో పాస్ పుస్తకాలు రావడంతో ఆందోళనకు గురవుతున్నారని కోదండరాం అన్నా రు. ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మీద దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తప్పులను సరిచేసి రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మానుకోట టీజేఎస్ సమన్వయకర్త డోలి సత్యనారాయణ అన్నారు. పోడు రైతులకు టీజేఎస్ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం సాక్షర భారత్ దీక్షా స్థలాన్ని సందర్శించిన కోదండరాం వారికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాంచంద్రునాయక్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సునీత, టీజేఎస్ నాయకులు పిల్లి సుధాకర్, భూక్యా సత్యనారాయణ, నారాయణసింగ్, మనోజ్, మాలోతు వెంకన్న, శశికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ రైతుదీక్షకు వెల్లువెత్తిన మద్దతు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019