breaking news
-
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
'ఫ్యామిలీ స్టార్' కోసం విజయ్కి భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..?
‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఒకపక్క దిల్ రాజు, మరోపక్క విజయ్..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు. విజయ్కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్లు సమాచారం. అలాగే మీడియా ఫ్యామిలీస్తో కలిసి ఓ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇలా విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం నిర్వహించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రూ. 50 కోట్ల బడ్జెట్ విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో గీతగోవిందం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ తర్వాతనే అటు పరశురాం, ఇటు విజయ్ కెరీర్ ఊపందుకుంది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్గా ఈ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్ అయిందని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. వర్కింగ్ డేస్ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిందట. ‘ఖుషీ’ కంటే ఎక్కువే ఈ సినిమాకుగాను విజయ్ దేవరకొండ భారీగానే పారితోషికాన్ని పుచ్చుకున్నాడట. మొత్తంగా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది గత చిత్రం ఖుషీ కంటే ఎక్కువ. ఖుషీ చిత్రానికి విజయ్ రూ.12 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ చిత్రం ఓ మోస్తరు విజయం మాత్రమే అందుకుంది. అంతకు ముందు వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ అయింది. అయినా కూడా విజయ్ మార్కెట్ పడిపోలేదు. అందుకే రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడలేదట దిల్ రాజు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో సోలోగా రిలీజ్ అవుతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. తొలుత తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అయింది. అన్ని ఏరియాల్లో కలిసి రూ. 45 కోట్ల మేర బిజినెస్ చేసిందట. గీతగోవిందం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కారణంగానే విజయ్ ఫ్లాప్స్లో ఉన్నా.. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ అయింది. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్స్టార్ నయనతారను దాటేసి నంబర్వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, నివిన్బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019