breaking news
-
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది.కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి.ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది.అంతలోనే ఇంత పెద్ద స్పందనా?కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలుఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్నోట్లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది.టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు.ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది.లక్ష్మి గతమంతా అక్రమాలేస్వర్ణ భారతి నగర్కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు.వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని..♦ 2013లో స్వర్ణభారతి నగర్కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు.2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు.మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించిందిమా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసిందిమేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టిందికోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకికోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్ట్రిక్స్నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
ప్రత్తిపాడులో టీడీపీ గూండాయిజం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్తి బూర్ల రామాంజనేయులు వైఎస్సార్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఇంటిపై స్వయంగా దాడికి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం కార్లు, ఇతర వాహనాలపై 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో, మారణాయుధాలతో వచ్చి రామాంజనేయులు ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారిని కార్లతో తొక్కించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులే ఓ గూండా మాదిరిగా ఇలా దాడికి పాల్పడటం అందరినీ విస్మయ పరిచింది. టీడీపీ గుండాయిజాన్ని తేటతెల్లం చేసింది. ఓడిపోతామన్న అక్కసుతోనే రామాంజనేయులు ఇలా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వారిపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్, వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయలు ఓ పథకం ప్రకారం కర్రలు, రాడ్లు, ఇతర మారణాయుధాలతో 20 కార్లు, ఇతర వాహనాలతో రౌడీమూకలను తీసుకొని గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కిరణ్కుమార్ కారు డ్రైవర్లు, వైఎస్సార్సీపీ నాయకులు ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడగ్గా, టీడీపీ రౌడీ మూకలు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. కారులోనే ఉన్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కొట్టండిరా వాళ్లను అంటూ రౌడీ మూకలను రెచ్చగొట్టాడు. దీంతో వారు రెచ్చిపోయి అభ్యర్థి బలసానిని, కార్యకర్తలను కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగటంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు కార్లు వెనక్కి తిప్పుకొని పారిపోయారు. కిరణ్కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు చేతికి తీవ్రగాయమైంది. గోరంట్లకు చెందిన తాళ్ళ అబ్బులును రౌడీ మూకలు కిందపడేసి కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి కాళ్ళ పైకి రామాంజనేయులు తన కారు ఎక్కించి, తొక్కించడంతో ఆయన కాలు విరిగింది.అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని కిరణ్కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ నరేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో టీడీపీ వారు కూడా అక్కడికి రావడంతో పోలీసు స్టేషన్ వద్ద కూడా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్కుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్ నూరీఫాతిమా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాల్పురం రాము ఫిర్యాదు చేశారు. రాళ్ళతో దాడిచేస్తూ వచ్చారు కార్యాలయం వద్ద కింద నాతోపాటు మరో పది మంది కార్యకర్తలు భోజనం చేసేందుకు ఉపక్రమిస్తున్నాం. ఒకేసారి సుమారు 20 కార్లు ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. వెంటనే కార్లలో నుంచి దిగిన టీడీపీ గూండాలు ఇంటిపైకి రాళ్ళు రువ్వుతూ ఎవరున్నారు లోపల బయటకు రాండిరా అంటూ దుర్భాషకు దిగారు. వెంటనే నేను, కార్యకర్తలు వారి వద్దకు వెళ్ళి ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించాం. కారులో ఉన్న టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు దుర్భాషలాడుతూ తనతో వచ్చిన రౌడీ మూకలతో వెయ్యండ్రా వీళ్ళని అని అరిచాడు. వెంటనే రౌడీ మూకలు మాపై దాడికి దిగారు. ఇంటివద్దకే వచ్చి చంపుతాం.. అంటూ రౌడీ మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడిలో నా చేతికి గాయమైంది. – ఇంద్రబాబు, కిరణ్కుమార్ డ్రైవర్ కారు ఎక్కించి తొక్కెయ్యిరా వాడిని అని రామాంజనేయులు అన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపై రాళ్ళతో, రౌడీలతో దాడికి పాల్పడుతున్నావ్.. ఇదేనా నీ సంస్కారం అంటూ నేను గట్టిగా నిలదీశాను. నేను, ఇతర వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం రామాంజనేయులుతో వచ్చిన రౌడీ మూకలపై ఎదురు దాడికి దిగాం. దీంతో రామాంజనేయులు తన కారుతో వాళ్ళను తొక్కెయ్యమని డ్రైవర్కు చెప్పాడు. కారును ఒక్కసారిగా ముందుకు వెనక్కు కదపటంతో కారు టైరు నా ఎడమ కాలుపై ఎక్కింది. కాలు పాదం వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. కారుతో తొక్కించి మమ్మల్ని అంతం చేయాలని బూర్ల రామాంజనేయులు ప్రయత్నించాడు. – మెట్టు వెంకటప్పారెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విచక్షణరహితంగా దాడి టీడీపీ రౌడీలు దాడికి దిగటంతో మమ్మల్ని మేం కాపాడుకునేందుకు ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో నన్ను, నాతోపాటు ఉన్న ఆర్ అండ్ బీ డైరెక్టర్ పిల్లి మేరిని సైతం రామాంజనేయులే స్వయంగా చేతులతో నెట్టి కిందపడేశాడు. ఆడ మనిషి అని కూడా చూడకుండా రౌడీ మూకలు మేరిపై దాడి చేశారు. నన్ను కొట్టారు. వెంటనే మేము లేచి ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో మమ్మల్ని కార్లతో తొక్కించే ప్రయత్నం చేసి పరారయ్యారు. – తాళ్ళ అబ్బులు, వైఎస్సార్సీపీ కార్యకర్త -
నరసరావుపేట కిడ్నాప్ కేసు విషాదాంతం
సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేటలో కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన రామాంజనేయులు హత్యకు గురయ్యాడు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలలో రామాంజనేయులు మృతదేహం లభ్యమైంది. రామాంజనేయుల్ని చంపిన దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి హైవేలో ఓ బ్రిడ్జి కింద పడేశారు. కళ్యాణ్ జ్యువలరీలో సేల్స్మెన్గా పనిచేస్తున్న రామాంజనేయుల్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే బాజీ, అన్నవరపు కిషోర్లే తన భర్తను చంపారని రామాంజనేయులు భార్య ఆరోపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామాంజనేయులు కిడ్నాప్ ఉపయోగించిన ఆటోను గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను విజువల్స్ ద్వారా మొత్తం ఐదుగురు కిడ్నాప్కు పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
బీజేపీ నేత అంజిబాబు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది. కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసింది. -
సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పై సస్పెన్షన్ వేటు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019