breaking news
-
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్గా, సెలక్టర్గా సేవలందించారు. -
‘కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్’
మొహాలి: ఆసియా కప్లో అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. దాంతో టి20ల్లో రోహిత్తో కలిసి కోహ్లి ఓపెనింగ్ చేయాలనే సూచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయిు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడలేడనే కారణం కూడా దానికి జోడించారు. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్పష్టతనిచ్చాడు. రాహుల్కు మద్దతుగా నిలుస్తూ అతనే ప్రధాన ఓపెనర్ అని, కోహ్లిని తాము మూడో ఓపెనర్గానే చూస్తున్నామని వెల్లడించాడు. అవసరమైతే కొన్ని మ్యాచ్లలో కోహ్లికి ఓపెనింగ్ అవకాశం ఇస్తామని, అయితే రాహుల్ విలువేంటో తమకు బాగా తెలుసని చెప్పాడు. ‘ప్రపంచకప్లాంటి టోర్నీకి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మంచిదే. ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఏదైనా ప్రయోగం చేశామంటే అదే శాశ్వతమని కాదు. మెగా టోర్నీకి ముందు ఆరు మ్యాచ్లు ఆడతాం కాబట్టి కోహ్లి ఓపెనింగ్ చేయవచ్చు కూడా. కానీ అతడిని మేం మూడో ఓపెనర్గానే చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచకప్లో రాహుల్ ఓపెనర్గానే ఆడతాడు. అతనో మ్యాచ్ విన్నర్. గత రెండేళ్లుగా అతని రికార్డు చూస్తే రాహుల్ ఎంత కీలక ఆటగాడో తెలుస్తుంది. ఒక మ్యాచ్లో ఒకరు బాగా ఆడారని మరో బ్యాటర్ను తక్కువ చేస్తే ఎలా. బయట ఏం మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఓపెనింగ్ గురించి మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురైనా...కొత్త తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని, ఇకపై కూడా అదే శైలిని కొనసాగిస్తామని కూడా రోహిత్ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతోపాటు టి20 ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని ఆదివారం బీసీసీఐ ఆవిష్కరించింది. -
టీమిండియాకు ఓపెనర్ల కొరత.. జట్టులోకి టి20 స్పెషలిస్ట్
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఓపెనర్ శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో తొలి వన్డేకు టీమిండియాకు ఓపెనర్ల కొరత ఎదురైంది. ధావన్, రుతురాజ్లు కరోనాతో.. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ తొలి వన్డేకు దూరమయ్యారు. దీంతో మయాంక్ అగర్వాల్లు ఉన్న పళంగా మయాంక్ అగర్వాల్కు పిలుపిచ్చారు. టీమిండియా గురువారం నుంచి ప్రాక్టీస్ ఆరంభించింది. అయితే నిబంధనల ప్రకారం మయాంక్ మూడురోజులు ఐసోలేషన్లో ఉండనున్నాడు. దీంతో మ్యాచ్ జరగనున్న ఆదివారం రోజున అందుబాటులోకి రానున్నాడు. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ ఒకవేళ మయాంక్ ఆడని పరిస్థితి వస్తే ఎలా అని బీసీసీఐ యోచన చేసింది. దీంతో బ్యాకప్ ఓపెనర్గా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ ఎంపికకు ముందు ఇషాన్ కిషన్ టి20 సిరీస్కు మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డే వరకు రోహిత్, మయాంక్లకు బ్యాకప్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఉంటాడని తెలిపింది. రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే.. ఇషాన్ను టి20 జట్టులోకి తిరిగి పంపించనున్నారు. ఒకవేళ తొలి వన్డే సమయానికి మయాంక్ ఆడకపోతే.. ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పటికే బయోబబూల్లో ఉంటున్నాడు. ఇక ఇషాన్ కిషన్ శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్లోనే 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఇక 5 టి20 మ్యాచ్ల్లో 113 పరుగులు చేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
స్టార్ హీరోపై మండిపడుతున్న నెటిజన్లు
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. మంచి పోస్ట్ అయితే ఏ రేంజ్లో ప్రశంసిస్తారో.. చెడు పోస్ట్ను కూడా అదే రేంజ్లో ట్రోల్స్ చేస్తారు. మీమ్స్, ట్రోలింగ్ల పేరుతో తాట తీసేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్ చేసిన పోస్ట్పై నెటిజన్లు మండిపడుతున్నారు. విజయదశమి సందర్బంగా హిందువులు ఆయుద పూజ చేస్తారు. వాహనాలకు, ఇంట్లో ముఖ్యమైన వస్తువులకు పూజలు నిర్వహిస్తారు. అయితే దసరా రోజు తన ఆయుదం అంటూ ఓపెనర్ కు రిషి కపూర్ ఆయుద పూజ చేయడంతో పాటు ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ‘ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. బాధ్యతగా వాడండి’ అంటూ ఓపెనర్కి పసుపు కుంకుమ రాసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ పోస్ట్పై నెటిజన్లు ఓ రేంజ్లో తగులుకున్నారు. ‘సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి’, ’ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?’ ఒక సెలబ్రిటీ నుంచి ఇలాంటి పోస్ట్ను ఊహించలేదు’, అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు పండుగ రోజు ఇలాంటి పోస్ట్ లు పెట్టేందుకు కనీసం నీకు బుద్ది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ ఫోటోలను పోస్ట్ చేయడం రిషికపూర్కు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటివి పోస్ట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డ రిషి కపూర్ అమెరికాలో దాదాపు 11 నెలల పాటు చికిత్స పొంది ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విహార యాత్రలో ఉన్న రిషి కపూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం కాబోతున్నట్లుగా సమాచారం. Happy Dusserah! Festive season begins. Use weapon responsibly 😊 pic.twitter.com/69YFNGvtJQ — Rishi Kapoor (@chintskap) October 8, 2019
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019