breaking news
-
భారత నంబర్వన్గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్వన్ ర్యాంకర్గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్వన్గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్లో, అర్చన కామత్ 100వ ర్యాంక్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఆచంట శరత్ కమల్తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో శరత్ కమల్ 37వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్లో నిలిచాడు. -
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఇటీవలే నంబర్వన్కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు. -
బుమ్రా నంబర్వన్
దుబాయ్: భారత్ నుంచి ఎంతోమంది పేస్ బౌలర్లు టెస్టుల్లో పలుమార్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. కానీ ఏనాడూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే ఆ లోటును తీరుస్తూ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని అందుకున్న తొలి భారతీయ పేస్ బౌలర్గా అవతరించాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో 30 ఏళ్ల బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి ఈ ఫార్మాట్లో టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా తన పేస్ పదునుతో తొమ్మిది వికెట్లు (6/45; 3/46) పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెల్చుకున్నాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 881 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గత ర్యాంకింగ్స్లో ‘టాప్’ ర్యాంక్లో ఉన్న భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు పడిపోయి 841 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ 851 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి నలుగురు బౌలర్లు మాత్రమే ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్లో నిలిచారు. గతంలో భారత స్పిన్నర్లు బిషన్సింగ్ బేడీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించగా... పేస్ బౌలర్ రూపంలో బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడిన బుమ్రా 155 వికెట్లు తీసుకున్నాడు. తాజా టాప్ ర్యాంక్తో బుమ్రా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ నంబర్వన్గా నిలిచిన తొలి బౌలర్గా గుర్తింపు పొందాడు. బుమ్రా 2017 నవంబర్ 4న తొలిసారి టి20 ఫార్మాట్లో... 2018 ఫిబ్రవరి 4న తొలిసారి వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంక్లో, టి20ల్లో వందో ర్యాంక్లో ఉన్నాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్లో నిలిచాడు. తదుపరి టెస్టులకూ దూరం! న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ కోహ్లి ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. అయితే తదుపరి మూడు టెస్టులకూ కోహ్లి సేవలు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్కోట్లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగుతుంది. తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. -
‘వైద్యం’లో తెలంగాణ నంబర్ వన్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్యవిద్యలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉండేదని, నిజామ్, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులే ఉండేవని గుర్తుచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని హరీశ్ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. ఎంబీబీఎస్ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నగరం నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ హబ్గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్ భవనాలు, అధునాతన అపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలు కల్ప0చామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్మెడల్స్ అందజేశారు. డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పలువురు హెచ్ఓడీలు, ఆర్ఎంఓలు, వైద్యులు, వైద్యవిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నెంబర్ 1 హీరోగా నాని
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019