breaking news
-
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
తెలంగాణ బోర్డర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ సందర్భంగా ఒక ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వివరాల ప్రకారం. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అనంతరం, ఘటనా స్థలంలో ఏకే-47 సహా మరో మూడు తుపాకులను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తెలంగాణలో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్
-
ఛత్తీస్గఢ్, తెలంగాణలో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/వెంకటాపురం: తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు అయిన ములుగు–బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతం లో మంగళవారం ఉదయం తుపాకుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఓ మహిళ ఉంది. 40–50 మంది ఉన్నారని తెలుసుకొని.. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 40–50 మంది సంచరిస్తున్నారని ఈ నెల 16న సమాచారం అందింది. టార్గెట్గా మారిన కొందరు సర్పంచ్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల హత్యలకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్టల వద్ద సాయుధ మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు కర్రిగుట్టల వద్ద పోలీస్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో వాళ్లు వెంటనే పోలీసులపై కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా అతడిని హెలికాప్టర్లో హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణకు తరలించి ప్రథమ చికిత్స చేసి తర్వాత హైదరాబాద్ తరలించారు. ఘటనా ప్రాంతం నుంచి ఓ ఎస్ఎల్ఆర్, ఓ ఇన్సాస్ రైఫిల్తో పాటు ఒక సింగిల్ బోర్, 10 రాకెట్ లాంచర్ల కిట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. తప్పించుకున్న వాళ్ల కోసం కూంబింగ్: ములుగు ఎస్పీ మృతి చెందిన మహిళా మావోయిస్టును వాజేడు–వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి మడకం సింగే అలియాస్ శాంతక్క అలియాస్ అనితగా పోలీసులు గుర్తించారు. ఈమె ఇటీవల వెంకటాపురం మండలం మాజీ సర్పంచ్ రమేశ్ను అపహరించి హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలిగా ప్రకటించారు. మరొకరు ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కొమ్ముల నరేశ్ అలియాస్ బుచ్చన్నగా గుర్తించారు. మూడో వ్యక్తిని మాత్రం ఇంకా గుర్తించలేదు. ఈయన ములుగు–ఏటూరునాగారం డీవీసీఎం సుధాకర్ అని సమాచారం. పక్కా సమాచారంతోనే మావోయిస్టుల కోసం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ జరుగుతోందని ములుగు ఎస్పీ ప్రకటించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ సాగుతోందన్నారు. కాగా ఎన్కౌంటర్లో మృతిచెందారని భావిస్తున్న సుధాకర్ ద్వారా ఆదివాసీలతో భారీ స్థాయిలో నియామకాలకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన చేసినట్టు తెలిసింది. తాజా ఎన్కౌంటర్తో కొత్త నియామకాలకు పోలీసులు అడ్డుకట్టవేసినట్టేనని భావిస్తున్నారు. సుక్మాలో మరో ఎన్కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా లోని మార్జుమ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. మార్జుమ్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్ ఏరియా కమిటీ తెహ్క్వారా ప్రాంతానికి చెందిన మన్హగు, మున్నీ, ప్రదీప్, సోమదుతో పాటు 20–25 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారని పోలీసు బలగాలకు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, బస్తర్, సుక్మా జిల్లాల డీఆర్జీ బృందాలు మంగళవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగానే ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన భద్రతా బలగాలు మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను మార్జుమ్ ఏరియా కమిటీ సభ్యురాలు మున్నీగా గుర్తించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. -
భారీ ఎన్కౌంటర్: మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మృతి
రాయ్పూర్: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుర్నవల్లి, పెసరపాడు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు రాత్రి నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మావోయిస్టుల మృతదేహాల తరలింపుపై డైలామా కొనసాగుతోంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాలా..లేక వరంగల్ ఎంజీఎంకు తరలించాలా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. చదవండి: హైదరాబాద్లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019