breaking news
-
'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్ ఖాన్ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్ సలహాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీనత్ అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్ తెలిపింది. గతంలో జీనత్ అమన్... నటుడు మజార్ ఖాన్తో వివాహంపై ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది. కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్ను పెళ్లాడారు. ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్ అమన్ 1985లో మజర్ ఖాన్ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన 12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది. -
ప్రేమలో ఉన్నారా? ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఆ మధ్య ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అవతలివారి కోసం మీ వ్యక్తిత్వాన్ని పక్కన పడేయొద్దని సూచించింది. నటి రిలేషన్ పాఠాలు తాజాగా మరోసారి ఆమె ప్రేమ పాఠాలు చెప్పింది. 'నేను ఇంతకుముందు ఏదో పోస్ట్ పెడితే రిలేషన్షిప్ సలహాలు ఇవ్వమని దానికింద కామెంట్లు చేశారు కదా.. ఇంతకుముందు ఎక్కడా చెప్పని ఓ విషయం ఇప్పుడు చెప్తున్నా వినండి.. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటాను. సహజీవనమే బెటర్ రెండు కుటుంబాలు, రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్.. ఇలా అన్నింటినీ భాగం చేసే ముందు మీ ప్రేమకు టెస్ట్ పెట్టుకోండి.. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్. నాకైతే ఇదే లాజిక్గా అనిపిస్తుంది. మీరు రోజూ కొన్ని గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అదే ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకోగలుగుతారా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చుతారా? నీకు నచ్చింది వంట చేసేందుకు ఒప్పుకుంటారా? సలహా బాగుంది కానీ.. బెడ్రూమ్, బాత్రూమ్.. అన్నింటినీ పంచుకోగలుగుతారా? సర్దుకుపోతారా? ఇలా ఎన్నో విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. సహజీవనం సరైనదే అంటే మన సమాజం అదొక పెద్ద పాపం అన్నట్లుగా చూస్తుంది.. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందిలే!' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
బిగ్బాస్ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్గా ఉంటూ!
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్బాస్ -14వ సీజన్లో మెరిసింది. అదే సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. బుల్లితెర నటులైన ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా.. గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్ అయ్యాక పూర్తిగా తన కెరీర్పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై
తిరువనంతపురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు శిశుపాలన్తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాలన్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈలైంగిక దాడి జరిగింది. అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019