breaking news
-
పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా: నెల రోజుల క్రితం పిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అడవిలో అస్తి పంజరాలయ్యారు. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. భర్త మృతదేహం అస్తిపంజరమై చెట్టుకు వేలాడుతుండగా, భార్య మృతదేహాన్ని అడవి జంతువులు పీక్కుతిన్నాయి. దీంతో కేవలం ఆమె పుర్రె మాత్రమే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నగరం గ్రామ సమీపంలో శుక్రవా రం ఈ అస్తిపంజరాలు వెలుగు చూశాయి. గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంకు చెందిన పెండకట్ల అనిల్కుమార్, దేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఈ ఏడాది మార్చి 10న ఇద్దరు చిన్నపిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపిన తలిదండ్రులు బైక్పై పరార య్యారు. నాటి నుంచి పోలీసులు భార్యాభ ర్తల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. నగరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని పొదల్లో బైక్ ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు ఇదే ప్రాంతంలో ఉంటారని భావించి బైక్ దొరికిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నగరం గ్రామ సమీ పం గుట్టమీద నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుకు ఓ మృతదే హం వేలాడుతూ కని పించింది. పోలీసులు వెంటనే అనిల్కుమార్ తండ్రి వెంకన్నను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించగా ఇది తన కొడుకుదేనని చెప్పాడు. దేవి మృతదేహం కోసం వెతుకగా పక్కనే పుర్రె, ఎముకలు, చీర లభించాయి. అడవి జంతువులు మృతదేహాన్ని తిని ఉంటాయని పోలీసులు భావించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు గుట్టపైకి డాక్టర్ను తీసుకొచ్చి అస్తిపంజరాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గుట్టపైనే కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కాగా, భార్యాభర్తలు ఎందుకు పిల్లలకు విషమిచ్చి చంపారు.. అసలు వాళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. పోలీసులు కూడా ఇదొక మిస్టరీలా ఉందని, ఇంకా కారణాలు తెలియలేదని చెబుతున్నారు. -
భార్య ప్రాణాలు తీసుకున్న మర్నాడే భర్త బలవన్మరణం
అనంతపురం: భార్య ఆత్మహత్య చేసుకున్న 24 గంటలు గడవకనే భర్త కూడా భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం సాయంత్రం చిన్నపొడమల గ్రామానికి చెందిన రమాదేవి (24) తాడిపత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని గంటలకే భర్త మంజునాథ (25) మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనలో మొండెం నుంచి తల వేరైంది. ఎడమ చెయ్యి మణికట్టు వరకు తెగింది. పెళ్లైన ఐదున్నర నెలల్లోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్యోన్యంగా ఉండే ఇద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదని గ్రామస్తులు అన్నారు. అయితే రమాదేవి ఆత్మహత్య అనంతరం అత్తింటి వారి అదనపు కట్నపు వేధింపులే కారణమంటూ రైల్వే పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామాంజినేయులు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటలకే మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అత్త, మామ వేధింపులు తాళలేక తమ ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ రైల్వే పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఓబుళమ్మ, బాల కుళ్లాయప్ప ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నగేష్ తెలిపారు. -
చిన్నపాటి ఘర్షణ.. భార్య ఆతహత్య.. సాగర్ కాల్వలో దూకిన భర్త?
సాక్షి, మిర్యాలగూడ: క్షణికావేశంలో ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీకి చెందిన గుంటి శివరామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11ళ్ల క్రితం వివాహం కాగా పట్టణంలోని రాజీవ్చౌక్ సమీ పంలో మీసేవా కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకోగా శివరామకృష్ణ తన సెల్ఫోన్ను ఇంట్లోనే వదిలేసి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత కింద పోర్షన్లో ఉన్న అత్తామామ పైకి వెళ్లి తలుపు తెరిచి చూడగా యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా భార్య యామిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న శివరామకృష్ణ మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్వ కట్ట వద్ద శివరామకృష్ణకు బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా భార్యాభర్తలు ఇద్దరూ సెన్సిటివ్గా ఉంటారని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని కాలనీవాసులు పేర్కొన్నారు. చదవండి: Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు · -
యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ
దంపతులిద్దరూ పని కోసం నగరానికి వలసొచ్చారు. ఆభరణాల తయారీతో జీవితం మారుతుందనుకున్నారు. ఎన్నో ఆశలతో బతుకు ప్రయాణం మొదలెట్టారు. చేతినిండా పని దొరకలేదు.. జేబులో గవ్వ నిలవలేదు! చుట్టూ ఆర్థిక చీకట్లు అలుముకున్నాయి. చావొక్కటే మార్గంలా కనిపించింది.. ఆభరణాలకు మెరుగుపట్టే సైనేడ్ తీపి పాయసమైంది భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో మింగారు. ఈలోకం విడిచి వెళ్లారు. పిల్లలు, వృద్ధులను ఒంటరి వాళ్లను చేశారు. ఇప్పుడు వీరికి దిక్కెవరు? సాక్షి, వరంగల్: బంగారం వ్యాపారానికి వరంగల్ నగరం అడ్డా. ఇక్కడ ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్ అలియాస్ నవధన్ (33) భార్య స్రవంతి(28)తో కలిసి నగరానికి వచ్చాడు. పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు విరాట్, విహార్. కరోనా.. ఆతరువాత అంతో ఇంతో కోలుకున్నా.. రానురానూ పని దొరకడం కష్టమైంది. కుటుంబ పోషణ భారమై.. ఇటీవల కొద్ది రోజుల నుంచి పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన నాన్న, అమ్మ. భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ. 10లక్ష నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చేదారి కని పించక సతీశ్ మానసికంగా కుంగిపోయాడు. రో జూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజులక్రితం తన తండ్రి మోహన్తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా, ఏమీ కాదు.. అన్ని సర్దుకుంటాయని మనోధైర్యం కల్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. చదవండి: Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. ప్రాణాలతో బయటపడిన విరాట్, సైనేడ్ను నీళ్లతో కలుపుకొని తాగిన బాటిళ్లు నాన్నా.. ఇది దేవుడి తీర్థం రా.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సతీశ్, స్రవంతిలు.. గురువారం రాత్రి చిన్న కుమారుడు నానమ్మ, తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా పెద్దకుమారుడు విరాట్ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్ను వాటర్బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. పెద్దకుమారుడికి ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా, దంపతులిద్దరూ చనిపోయారు. కొడుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు.. చేతికొచ్చిన కొడుకు తమను సాకుతాడని భావించిన తండ్రి ఆకొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘కొడుకా.. ఇంత పనిచేస్తావనుకోలేదు’అంటూ ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దంపతుల ఆత్మహత్య
మల్కాజిగిరి: కుటుంబ సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మల్కాజిగిరి బృందావన్ కాలనీకి చెందిన కామిశెట్టి సాయిదాసు(65),విజయలక్షి్మ(60) దంపతులకు సంతానం లేదు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 26న తమ బంధువు పోతన శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లమని చెప్పారు. 27న ఉదయం అతను సాయిదాసు ఇంటికి వెళ్లి పిలిచినా పలకక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఆనంద్బాగ్లో నివాసముంటున్న సాయిదాసు సోదరుడు మెహర్ ఓంకార్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు చెక్!:.. 10 వారాల్లో 106 మంది అరెస్టు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019