breaking news
-
నాటి జ్ఞాపకాలు.. నేటి ఆనందబాష్పాల్లో... 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!
హిమాయత్నగర్ (హైదరాబాద్): ‘‘ఏరా ఉదయ్ నువ్వేం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, హేయ్ కేఆర్పీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా యంగ్ ఉన్నావ్రా, రేయ్ నరోత్తమ్..క్యా బాత్హేబై బోత్ దిన్ కా బాద్, జయంత్ నీ అప్డేట్స్ అన్నీ వాట్సప్ స్టేటస్లలో చూస్తూనే ఉన్నారా’’ అంటూ 50ఏళ్ల తర్వాత నేరుగా కలిసిన ఆ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగానికి గురైన సంఘటన హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో జరిగింది. ఒకరిపై మరొకరు సైటైర్లు, ఇతర స్కూల్లో అమ్మాయిలకు రాసిన లవ్ లెటర్స్, క్రికెట్ స్కోర్ కోసం స్కూల్ నుంచి పారిపోయిన సందర్భం, బస్టాప్లో నచ్చిన అమ్మాయికి సైట్ కొట్టే తుంటరి చేష్టలను నెమరువేసుకున్నారు. ఆనాటి సంఘటనలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ తరగతి గది వాతావరణాన్ని తెచ్చారు 1972 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థులు. ఈ బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఇక్కడ టెన్త్ చదివి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా బుధవారం స్కూల్లో గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ను నిర్వహించగా.. 108 స్టూడెంట్స్లో 64 మంది హాజరయ్యారు. వీరితో పాటు అప్పుడు పాఠాలు బోధించిన టీచర్స్ రసూల్, కష్ణమూర్తి, మారెడ్డి, షకీనా, ఐరీన్, కిటీ, మెజీలను సైతం ఆహ్వానించారు. స్టూడెంట్స్ అంతా అప్పట్లో యూనిఫాం అయిన బిస్కెట్ కలర్ ప్యాంట్, వైట్కలర్ షర్ట్ను ధరించి ఉదయం 10 గంటలకు క్లాస్రూంలోకి అడుగుపెట్టారు. టెన్త్–సి క్లాస్ రూంలో వీరందరికీ సైన్స్ టీచర్ షకీనా క్లాస్ తీసుకున్నారు. రోల్నంబర్తో పిలుస్తూ..బ్యాగులు లేకుండా క్లాస్కు ఎందుకు అటెండ్ అయ్యారంటూ సరదాగా ఆటపట్టించారు. ఉదయ్కుమార్ నాయుడు, సేష్ నారాయణ్, కేఆర్పీ రెడ్డి, జితేన్కుమార్, అశోక్నాథ్, సీఎస్ రావు, జయంత్, నరోత్తమ్రెడ్డి తదితరులు తరగతి గదిలో కూర్చుని ఉండగా.. వీరిలో కొందరి సతీమణులు స్టూడెంట్స్గా కూర్చున్న భర్తల్ని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి వాతావారణాన్ని తెచ్చారు. స్కూల్కు 27 లక్షలు సాయం నేను ఈ స్కూల్లోనే చదివాను. 50 ఏళ్ల తర్వాత మేం కలిసిన ఈ సుభ సందర్భాన నా వంతుగా స్కూల్కు రూ.27లక్షలు డిపాజిట్ చేస్తున్నాను. దీనిలో రూ.18లక్షలు ఇక్కడ స్కూల్లో ఉన్న పేద విద్యార్థుల చదువు నిమిత్తం, రూ.9 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వినియోగిస్తాం. – డి.జయంత్, 1972 స్టూడెంట్ నా బాధలు పోయాయి కల్లా కపటం లేకుండా ఉండి నేడు ఉన్నత స్థానాలకు ఎదిగిన మీరంతా ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. ఈ వేదికపై 50 ఏళ్ల క్రితం మీకు పాఠాలు చెప్పిన మమ్మల్ని ఆహ్వానించడం అభినందించదగ్గ విషయం. ఈ వయసులో ఎన్నో బాధలు, సమస్యలతో సతమతం అవుతున్న మాకు మిమ్మల్ని చూడగానే బాధలన్నీ పోయాయి. – మారెడ్డి, తెలుగు టీచర్ -
Hyderabad: మూడేళ్లుగా చెల్లెలిపైనే అఘాయిత్యం..
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం నగరంలో వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్కు చెందిన కుటుంబం హిమాయత్నగర్లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు. దీనిని అసరగా తీసుకున్న రోహన్ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు లైంగిక దాడిచేశాడు. ఇదిలా ఉండగా జూన్లో బాధితురాలు నేపాల్కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్నాయుడుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. చదవండి: గుజరాత్లో కారు బీభత్సం.. ఆరుగురు మృతి -
Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
Sree Lakshmi Reddy: Social Worker Mobile Counselling In Hyderabad: ‘పని చేసే చేతికి తీరిక ఉండదు... పని చేయని మనిషికి పని కనిపించదు’ ఈ నానుడిని నిజం చేస్తోంది లక్ష్మక్క. సామాజిక కార్యకర్తగా దశాబ్దాల సేవ ఆమెది. కష్టంలో ఉన్న మహిళలకు సహాయం చేయడానికి ఇప్పుడామె... స్వయంగా కదలి వెళ్తోంది. ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ తో 1997లో మొదలైన శ్రీలక్ష్మిరెడ్డి సోషల్ సర్వీస్ మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో విస్తరించింది. ఇన్నాళ్లూ ఆమె హైదరాబాద్, హిమాయత్ నగర్లో ఆఫీస్లో ఉండి, వచ్చిన వాళ్లకు ఉచితంగా సర్వీస్ ఇచ్చారు, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు చేయూత అయ్యారు. కొంతమంది ఆమె ఫోన్ నంబరు తెలుసుకుని ఫోన్ చేస్తారు. తమ కష్టమంతా చెప్పుకుంటారు. వాళ్లలో తాము నివసించే కాలనీ దాటి శ్రీలక్ష్మి దగ్గరకు రావడం కూడా చేతకాని అమాయకులు, దారి ఖర్చులకు డబ్బులు లేని వాళ్లు ఎందరో! ‘వాళ్లను అలా వదిలేస్తే నేను ఇస్తున్న సర్వీస్కి పరిపూర్ణత ఎలా వస్తుంది?... అని చాలా సార్లు అనిపించేది. అందుకే మా అమ్మ ఆరవ వర్థంతి సందర్భం గా నవంబర్ 26వ తేదీన ‘అల్లారెడ్డి కమలమ్మ – వెంకు రెడ్డి మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్’ పేరుతో సంచార కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించాను’ అని చెప్పారు శ్రీలక్ష్మి. పెళ్లికి ముందే కౌన్సెలింగ్! ‘‘కలహాలు లేని కాపురం ఉండబోదు. కలహం వస్తే విడిపోవడమే పరిష్కారం కాదు. చక్కదిద్దుకోవడానికి ఉన్న అన్ని దారులనూ అన్వేషించాలి. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. విడిపోవడం అనేది విధిలేని పరిస్థితుల్లో చివరి ఎంపిక కావాలి తప్ప తొలి ఎంపిక కాకూడదు... అని సమాధాన పరచాల్సి వస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలకు రూట్కాజ్కు వైద్యం చేయాలనుకుని, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ కూడా మొదలుపెట్టాను. పెళ్లయిన తర్వాత భార్యగా నీ బాధ్యతలను మర్చిపోకూడదు, అలాగే భర్తగా అతడి బాధ్యతల గురించి హెచ్చరించగలగాలి... అని అమ్మాయిలకు పాఠంలా చెప్పాల్సి వస్తోంది. ఇంట్లో పెద్దవాళ్లకు ఇవన్నీ చెప్పే తీరిక ఉండడం లేదు. అలాగే ఇంట్లో వాళ్లు అన్నింటినీ చెప్పలేరు కూడా. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను’’ అని చెప్పారు శ్రీలక్ష్మి. నేర్చుకున్నాను... నేర్పిస్తున్నాను! ‘మహిళలు స్వయం సమృద్ధి సాధించాలంటే వాళ్లకు ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫినాయిల్ తయారీ నుంచి, ఫ్యాషన్ డిజైనింగ్ వరకు పాతిక రకాలలో శిక్షణ తీసుకున్నాను. మహిళలకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాను’ అని కూడా చెప్పారామె. ఫ్యామిలీ కౌన్సెలింగ్ గదికి పక్కనే ఉన్న మరో గదిలో మహిళలకు జాక్ మెషీన్ల మీద ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. వారిలో ఓ యువతి తన రెండేళ్ల బిడ్డను ఒక సోఫాలో పడుకోబెట్టి తాను పని నేర్చుకుంటోంది. అమ్మ వంటి అక్క ఉంది మొబైల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్లో చార్మినార్, దోమల్గూడ, నారాయణగూడ వెళ్లాను. సమస్యలకు దగ్గరగా వెళ్లినకొద్దీ ఇలాంటి సర్వీస్ ఎంత అవసరం ఉందో అర్థమవుతోంది. నేను ఒక్కదాన్ని ఎంత చేసినా నూరోవంతు కూడా పూర్తికాదు. నాకిప్పుడు యాభై ఆరేళ్లు. నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే లోపు నాలాగ ఉచితంగా సర్వీస్ ఇచ్చే మరికొందరిని తయారు చేస్తాను. నాకు రామకృష్ణ మఠంలో అలవడిన సమాజసేవ ఇది. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటే సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నమ్మే స్కూల్లో శిక్షణ పొందాను. అందుకే నా సర్వీస్ అంతా కుటుంబ బంధాలను పటిష్టం చేయడం కోసమే సాగుతుంది. – శ్రీలక్ష్మి రెడ్డి, సామాజిక కార్యకర్త చదవండి: Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ.. -
నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..
సాక్షి, హిమాయత్నగర్: డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చి మరో ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానంటూ చెప్పి బయటకు వచ్చిన యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం మేరకు ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య డీఆర్డీఏ పరివార్ ప్రాంతంలో నివాసం ఉండే నిధా రెహమాన్(34) అబిడ్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో ఐదు నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి.. యూసఫ్గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ రోడ్డులో తన ముందు వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. చదవండి: పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనక చక్రాల కింద పడటంతో.. తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కొండపల్లి నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ సాయంతో యువతి మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నెల రోజుల్లో పెళ్లి... యూసఫ్గూడలో నివాసం ఉండే పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ మృతురాలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు వివాహానికి కూడా ఒప్పుకున్నారు. మరో నెల రోజుల్లో వివాహం కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవాబ్ఖాన్ను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇంతటి ఘోరం జరిగిందని నవాబ్ఖాన్ తెలిపారు. -
నాకిక ఓపిక లేదు..
హిమాయత్నగర్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్స్టా లైవ్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్స్టా ఐడీలో లైవ్లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019