breaking news
-
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతారు!
ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే. మనం ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్ స్పాట్లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! యూఎస్లోని మిషిగన్, సెయింట్ ఇగ్నస్ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్ వోర్టెక్స్’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్ ఆఫ్ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి. ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్ని ఎంజాయ్ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు. ఈ స్పాట్.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సంహిత నిమ్మన (చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..) -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
చందమామపై బాంబులు వేశారు.. ఎందుకంటే..
చిన్నప్పుడు గోరుముద్దలు తిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వెన్నెలలో ఎంజాయ్ చేసేదాకా.. చందమామ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఇప్పటికే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అక్కడ ఇండ్లు కట్టుకుని ఉండిపోయే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. మరి అలాంటి చందమామపై బాంబులు పేలాయి తెలుసా? అదీ ఒకటీ రెండు సార్లు కాదు చాలా సార్లు. మరి ఎవరు బాంబులు వేశారు? ఎందుకు వేశారు? బాంబులు వేస్తే ఏం జరిగింది? బాంబులు వేయడమే కాకుండా ఇంకా ఏమేం చేశారు? అనే వివరాలు తెలుసుకుందామా? చంద్రుడిపై అడుగుపెట్టి 52 ఏళ్లు చందమామపై మనిషి అడుగుపెట్టి దాదాపు 52 ఏళ్లు అవుతోంది. 1969 జూలై 11న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేశాడు. అమెరికా నిర్వహించిన అపోలో ప్రయోగాలతో మొత్తంగా 24 మంది చందమామపైకి వెళ్లారు. చివరిగా 1972 డిసెంబర్ 19న చంద్రుడిపై గడిపారు. ఇలా వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై పలు రకాల పరిశోధనలు చేశారు. అక్కడి భూమి, వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి, ఇతర అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. చంద్రుడి మట్టి, రాళ్లను భూమిపైకి తీసుకువచ్చారు. గోల్ఫ్ ఆడి.. ఎగిరి దుమికి.. చంద్రుడిపై వ్యోమగాములు ఏమేం చేశారో తెలుసా? అక్కడగోల్ఫ్ ఆడారు. ప్రఖ్యాత ‘హ్యామర్ అండ్ ఫెదర్ (పక్షి ఈకను, ఒక సుత్తి ని ఒకే ఎత్తు నుంచి వదిలి ఏది ముందు కింద పడుతుందో పరిశీలించడం)’ ప్రయోగాన్నీ చేశారు. గాల్లోకి ఎగిరి దూకారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? చంద్రుడిౖ గురుత్వాకర్షణ (గ్రావిటీ)ని పరీక్షించడానికి. ఇక రోవర్ను నడుపుకొంటూ తిరగడం, అక్కడి ఉపరితలంతోపాటు భూమిని, నక్షత్రాలను ఫొటోలు తీయడం వంటివీ చేశారు. వీటన్నింటితోపాటు చేసిన మరో పరీక్షే బాంబులు వేయడం. అదెందుకో చూద్దామా.. గ్రనేడ్లు, మోర్టార్లతో.. అమెరికా చేసిన అపోలో 14, అపోలో 16 ప్రయోగాల్లో చంద్రుడిపైకి గ్రెనేడ్లు, మోర్టార్లు పంపారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగిన ప్రదేశం నుంచి ఒకసారి కిలోమీటర్ దూరంలో, మరోసారి 3.5 కిలోమీటర్ల దూరంలో వాటిని పేల్చారు. రోవర్ను నడుపుకొంటూ వెళ్లి వాటిని అమర్చారు. ఇదంతా చంద్రుడి నేల నిర్మాణాన్ని పరిశీలించేందుకు చేపట్టిన ‘యాక్టివ్ సిస్మిక్ ఎక్స్పెరిమెంట్’లో భాగమే. బాంబులు పేలిన తర్వాత అక్కడి నేలలో ఏర్పడిన ప్రకంపనలను ప్రత్యేక పరికరాలతో నమోదు చేశారు. తర్వాత నాసా శాస్త్రవేత్తలు ఆ డేటాను విశ్లేషించి చంద్రుడి ఉపరితలం నిర్మాణాన్ని అంచనా వేశారు. ప్రయోగాల్లో తేలింది ఏమిటి? సాధారణంగా భూమిలో ఏర్పడిన ప్రకంపనలతో ప్రత్యేకమైన తరంగాలు (సిస్మిక్ వేవ్స్) ఏర్పడి.. నేల పొరల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు ఘన, ద్రవ పదార్థాలు, వివిధ మూలకాల ద్వారా వెళ్లేటప్పుడు వాటి వేగం, తీవ్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించి నేల పొరల్లో ఏముంది, ఎలా ఉన్నాయన్నది గుర్తిస్తారు. ► భూమ్మీద సహజంగానే భూకంపాలు వస్తుంటాయి కాబట్టి.. శాస్త్రవేత్తలు సులువుగానే విశ్లేషిస్తారు. అదే చంద్రుడి నేల స్థిరంగా ఉండటంతో ప్రకంపనలు అతి తక్కువ. అందువల్ల బాంబులతో ప్రకంపనలు సృష్టించి, పరిశీలించారు. ► బాంబులు పేల్చిన ప్రాంతంలో 1.4 కిలోమీటర్ల మందంతో బసాల్ట్ (భూమిపై ఉండే తరహాలో మట్టి, రాళ్లతో కూడిన) పొర ఉన్నట్టు గుర్తించారు. చంద్రుడి నేల లోపల చాలా వరకు పగుళ్లు ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై పడిన పెద్ద పెద్ద ఉల్కలే దీనికి కారణమని అంచనా వేశారు. ఆ బాంబులు ఇప్పటికీ అక్కడే.. అపోలో 14 మిషన్లో 22 గ్రనేడ్లు, ఒక మోర్టార్ తీసుకెళ్లారు. అందులో 13 గ్రనేడ్లు మాత్రమే పేలాయి. అపోలో 16 మిషన్లో మరో 22 గ్రనేడ్లు, 4 మోర్టార్లు తీసుకెళ్లారు. ఇందులో 19 గ్రనేడ్లు, 3 మోర్టార్లు పేలాయి. రెండుసార్లు కలిపి 12 గ్రనేడ్లు, రెండు మోర్టార్లు అలాగే చంద్రుడిపై పడి ఉన్నాయి. వీటన్నింటిలో ‘హెక్సానైట్రోస్టిల్బేన్’ అనే పేలుడు పదార్థం ఉంది. దానికి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉండటంతో.. ఇప్పటికీ గ్రనేడ్లు, బాంబులు చంద్రుడిపై అలాగే ఉండి ఉంటాయని భావిస్తున్నారు. రెండు దేశాలు.. ఏడు జెండాలు చందమామపై రెండు దేశాల జెండాలు మాత్రమే ఉన్నాయి. ఆరు మిషన్లలో వేర్వేరు చోట్ల దిగిన అమెరికా వ్యోమగాములు ప్రతిసారి తమ దేశ జెండా ఒకదానిని పాతారు. తర్వాత చైనా తమ జెండాను చంద్రుడిపై పాతింది. అయితే చైనా వ్యోమగాములెవరూ చంద్రుడిపై దిగలేదు. కానీ రోవర్ ద్వారా పంపిన జెండాను పెట్టారు. ఇప్పటివరకు ఆరు ప్రయోగాల్లో చంద్రుడిపై మనుషులు దిగారు. అవన్నీ అమెరికా నిర్వహించిన అపోలో సిరీస్ మిషన్లే. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘ఆ ఆర్టికల్’ గురించి పాలకులకు తెలుసా ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు?’ అన్న ప్రశ్నకు ‘ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్’ అని ఎవరైనా టక్కున సమాధానం చెప్పారంటే మన కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో న్యూటన్ కన్నా ముందే మన పురాణాల్లో గురుత్వాకర్షణ సిద్ధాంత ప్రస్తావన ఉంది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్’ శనివారం ఏర్పాటు చేసిన ‘జ్ఞానోత్సవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇలా మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. ‘మన రాశి ఫలాల శాస్త్రం ముందు సైన్స్ ఎప్పుడూ పిగ్మీ’నే అని చెప్పడమే కాకుండా మన పూర్వికులు ఎప్పుడో అణు పరీక్షలు నిర్వహించారంటూ గత లోక్సభ వేదిక సాక్షిగా వాదించారు. అందుకేనేమో ఆయనకు ఈసారి కేంద్ర మంత్రిగా పదోన్నది వచ్చింది. అలా అని ఆయన్ని ఒక్కరినే తప్పుపట్టడం భావ్యం కాదు. చాలా మంది బీజేపీ నాయకులకు ఇలా మాట్లాడే అలవాటుంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మ గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘టెస్ట్ ట్యూబ్ బేబీస్’ గురించి ప్రాచీన భారతీయులకు ముందే తెలుసునని, సీత పుట్టుకే అందుకు ఉదాహరణని చెప్పారు. టెలివిజన్ ప్రసారాల గురించి, విమానాల గురించి కూడా వారికి తెలుసని తెలిపారు. బీజేపీకి చెందిన మరో పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్ సింగ్ ‘మానవ పరిణామక్రమం సిద్ధాంతం’ను అంగీకరించేందుకు అసలు సిద్ధంగా లేరు. ప్రాచీన రుషుల శిష్యులే నేటి మానవ జాతని పదే పదే చెబుతూ వస్తున్నారు. అంతెందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే, ప్రాచీన భారతీయులకు జన్యుశాస్త్రం గురించి అంతా తెలుసునని, ప్లాస్టిక్ సర్జరీ కూడా అప్పటికే ఉందని, అందుకు వినాయకుడికి ఏనుగు తలను అతికించడమే సాక్ష్యమని చెప్పారు. అసలు ఆత్మసాక్షిగా ఈ విషయాలను నమ్మి మాట్లాడుతారా? అవసరం కోసం మాట్లాడుతారా? అన్నది వారికే తెలియాలి. అసలు ఇంత అసంబద్ధంగా మాట్లాడే వారిని జనం ఎలా భరిస్తారబ్బా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. జనంలో అక్షరాస్యత పెరగకపోవడం, ముఖ్యంగా శాస్త్రవిజ్ఞాన దృక్పథం లేక అజ్ఞానంలో బతుకుతుండటం వల్ల భరిస్తుండవచ్చు. కానీ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ‘ఆర్టికల్ 51ఏ’ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రవిజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అందుకు పాలకులు కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఆ తర్వాత 2010లో కేంద్రం తీసుకొచ్చిన ‘విద్యా ప్రాథమిక హక్కు’ చట్టంలో ప్రతి విద్యార్థికి శాస్త్ర విజ్ఞాన దక్పథం ఉండాలన్న విషయాన్ని పొందుపర్చారు. దేశంలో అనాదిగా వస్తోన్న ‘బహిర్భూమి’ అనాచారం వల్ల ఏటా లక్షలాది మంది ప్రజలు అంటురోగాలకు గురై మరణిస్తున్నారని, దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలంటూ ప్రభుత్వ విధాన నిర్ణేతలు చెప్పడం కూడా శాస్త్రవిజ్ఞాన దృక్పథమే. ఆ దిక్కుగా మరుగు దొడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందీ, ఇస్తున్నది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీనే. దేశంలో విద్యాభివద్ధి కోసం కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖదే. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోఖ్రియాల్ కొత్త విద్యా విధానాన్ని ఎలా రూపొందిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే. అసలు కొత్త విద్యా విధానం రూపకల్పన కసరత్తులో భాగంగా నిర్వహించిన ‘జ్ఞానోత్సవ్’లోనే గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడారు. చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించి ప్రయోగాలు నిర్వహించేందుకు ‘చంద్రయాన్–2’ను పంపించిన భారత్లో ఇలాంటి పాలకులు ఉండడం ఆశ్చర్యమే. రాజ్యాంగానికి బద్ధులై ఉంటామని ప్రమాణ స్వీకారం చేసినందున పోఖ్రియాల్ సహా పాలకులంతా ‘ఆర్టికల్ 51 ఏ’ను గౌరవించాల్సిందే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019