breaking news
-
మీ ఫోనే.. మీ ఆయుధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్ ఒకే ఒక్కడు... అటువైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంట్.. అన్నీ జరుగుతున్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మీ జగన్ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్కు తోడుగా ఉన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. మీకు ఎంత చేసినా తక్కువే ఆ దేవుడి దయమీద జగన్కు నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్ లైనింగ్ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే! ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉన్నట్లే! దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. వందల మంది చంద్రబాబులు, రామోజీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ తొణకడు. కారణం.. పైన దేవుడున్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. ప్రత్యేకంగా యాప్.. సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది. చెల్లి గీతాంజలి చావుకు కారకులు.. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్ మీడియాలో జగన్కు సపోర్ట్ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం. అన్నా.. జాగ్రత్త తెనాలిలో ఇంటి పట్టా తీసుకున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.. విశాఖ ఎయిర్పోర్టులోని ఫుడ్ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను పీసీఎస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు. సీఎస్వో వేణుగోపాల్ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్పోర్టు ముస్లింలంతా మీ వెనకే .. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్ చైర్పర్సన్గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు తమ్ముడు భరత్కుమార్రెడ్డి ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసేది. భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనసుకు, దేహానికి ఎంత గాయమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి. – బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు సోషల్ మీడియా సైనికుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్ మా ఇంటికి వచ్చారు. మీకు సాయం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మెంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపోయినప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా! – వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
ఏంటి? మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!
సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్ఫోన్ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్– ఏ60ఎస్ సెల్ఫోన్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీకు ఆర్డర్ పెట్టాడు. సెల్ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్ బాయ్ ఫోన్ వచ్చిందంటూ ఓ బాక్స్ అందజేశాడు. ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్ బాయ్ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్ బాయ్ వెంటనే సంబంధిత కొరియర్ కంపెనీకి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్ ప్రకారం సెల్ఫోన్ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు. -
వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్ఫోన్..!!
ఆదిలాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28) పటాన్చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మొఘల్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్ తన బంధువు గౌస్ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఎజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు. టోలీచౌకీకి నదీమ్ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్, షహజాజ్ బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019