breaking news
-
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 28 సీట్లు, బీహార్లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్సభ పదవీకాలం నవంబర్తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ కాంగ్రెస్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
అలా కుట్ర పన్నినందుకే ఓటర్లు బీజేపీకి తగిన పాఠం చెప్పారు!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వేధించినందుకు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దాదాపు పదేళ్ల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీని లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు వేయాలని, ఆయనను నిరాశ్రయులను చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని నానో పటోలే అన్నారు. గత మార్చి నెలలో గుజరాత్ సూరత్ కోర్టు పరవు నష్టం కేసులో దోషిగా తేలుస్తూ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటు, ఆ తర్వాత వెంటనే అధికార నివాసాన్ని ఖాళీ చేయించడం తదితర చర్యలతో రాహుల్ని అవమానపరిచారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలే తమ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని నానా పటోలే అన్నారు. ఈ క్రమంలో శివసేనలో చీలికకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 16 మంది సేన ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత నోటీసులపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మాహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసిన పటోలే రాహుల్ నార్వేకర్ తాను నిర్వహిస్తున్న పదవిని కించపరిచేలా చేయకూడదని హితవు పలికారు. (చదవండి: ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు) -
ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది!
కర్ణాటకలో ఒకే విడతలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా దాదాపు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అతన్ని కుటుంబాన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు మీడియా సమావేశంలో ఓ ఆడియో క్లిప్ని ప్లే చేసింది. బెంగళూరులోని చిత్తాపూర్ని బీజేపి అభ్యర్థిగా మణికంఠ రాథోడ్ని బరిలోకి దింపింది. అతను ఎలాంటి వాడో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తెలుసని, అతని నేర చరిత్రకు సంబంధించిన ట్రాక్ రికార్డు గురించి వారికి బాగా తెలసునంటూ వ్యాఖ్యానించింది. ఐతే అదే ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారు. కావాలనే బీజేపీ ఇలా మణికంఠని మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడిపైకి పోటికి దింపిందని ఫైర్అయ్యింది. చిత్రాపూర్ నియోజకవర్గం ప్రజలను అవమానించేందుకే బీజేపి ఇలా ఒక రౌడీషీటర్ని దింపోతోందని విమర్శించింది. పైగా కాంగ్రెస్ విడుదల చేసిన ఆ ఆడియో క్లిప్లో బీజేపీ అభ్యర్థి అనుచిత పదజాలంతో మల్లిఖార్జున ఖర్గేని, అతని కుటుబాన్ని మట్టుబెడతానని చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ బీజేపీ కావాలనే ఇలా చేస్తుందని, ఒకవేళ ఏదైనా జరిగినా..మోదీతో సహా కర్ణాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా మౌనంగా ఉంటుందని మండిపడింది కాంగ్రెస్. ఐతే కర్ణాటక ప్రజలు దీన్ని చూసి మౌనంగా ఉండరని తగిన సమాధానం చెబుతారని నొక్కి చెప్పింది. కాగా, బీజేపీ అభ్యర్థి మణికంఠ 30కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద అభ్యర్థి. కలబురిగి నుంచి బహిష్కరించారు కూడా. గతంలో మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేని హత్య చేస్తానని బహిరంగంగా బెందిరించి అరెస్టు అయ్యాడు. ఆ తదుపడి బెయిల్పై విడుదలయ్యాడు. Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, who has over 40 criminal cases against him. He also happens to be the "blue-eyed boy" of PM Modi & CM Bommai. In this viral audio, the BJP leader can be heard saying- *"Will wipe off Kharge's family"* Here's… pic.twitter.com/NIcBMkgDhD — Congress (@INCIndia) May 6, 2023 (చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..) -
బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్ కమిటీ జాతీయ ఇన్చార్జి పి. మురళీధర్రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. మొత్తం 14 సెషన్స్.. పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్ సాధించిన విజయాలపై కిషన్రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. బీఎల్ సంతోష్ హాజరవుతారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సంతోష్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019