breaking news
-
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!
తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉగాది (ఏప్రిల్ 3) రోజున ఆకాశం నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిండి, కోటపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను తమ స్మార్ట్ఫోన్లలో బంధిస్తూ తెగ సంబరపడిపోయారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆకస్మాత్తుగా ఆకాశం నుంచి నేలరాలిన ఉల్కపాతంపై ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను తెలియజేశారు. అవి ఉల్కలు కాదు...! ఏప్రిల్ 2న ఆకాశంలో వెలుగులు విరజిమ్ముత్తూ కన్పించినవి ఉల్కలు కాదని ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు నిర్ధారించారు. సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ ఈ ఉల్కాపాతంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ ఆకాశం నుంచి నేల రాలిన వస్తువులు ఉల్కలు కాదని అవి గతంతో డ్రాగన్ కంట్రీ చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R — ANI (@ANI) April 2, 2022 చైనా ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన చాంగ్ జెంగ్ 3B సీరియల్ నంబర్ Y77 రాకెట్ మూడవ దశ భాగాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై నాగ్పూర్కు చెందిన స్కైవాచ్ గ్రూప్ ప్రెసిడెంట్ సురేష్ చోపడే కూడా స్పందించారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో కన్పించినా ఈ అరుదైన దృశ్యాలు ఉల్కలు కాదంటూ పేర్కొన్నారు. అవి శాటిలైట్కు సంబంధించిన గ్రహశకలాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో శాటిలైట్కు సంబంధించిన భారీ శకలాలు పడి ఉన్నట్లు గమనార్హం. I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 - it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK — Jonathan McDowell (@planet4589) April 2, 2022 చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం..! -
భళా భరద్వాజ్.. అమెరికాలో తెలుగు విద్యార్థి అద్భుత ప్రతిభ
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆణిముత్యం ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు సాధించి మాతృదేశం గర్వించేలా పేరు తెచ్చుకున్నాడు. అతనే విశాఖ జిల్లా సీలేరులోని ఏపీ జెన్కో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ కామేశ్వర శర్మ కుమారుడు భరద్వాజ్. హైదరాబాద్లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ యూఎంకేసీలో నిర్వహించిన అర్హత పరీక్షలో భరద్వాజ్ ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు శాస్త్ర పరిశోధనలు చేశాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరద్వాజ్ పరిశోధనలు చేశాడు. దీంతో ఖగోళ భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమ కుమారుడి పరిశోధనలకు వచ్చిన గుర్తింపుపై సోమవారం భరద్వాజ్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రంతో భరద్వాజ్ ఖగోళ భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి డాక్టరేట్ ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన వ్యక్తి భరద్వాజ్ అని వారు తెలిపారు. తమ కుమారుడి కృషివెనుక ప్రొఫెసర్ డానియేల్ మాకింటోస్, మార్క్ బ్రాడ్విన్ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ పరిశోధనల సమయంలో ఎనిమిది సంస్థల నుంచి ఉపకార వేతనాలు లభించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్ కొనసాగిస్తున్న మరో పరిశోధనకు అమెరికాలోని నాసా ఉపకార వేతనం కూడా అందించనుందన్నారు. భరద్వాజ్ పరిశోధనలు మెచ్చి 2018లో అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ స్వర్ణ పతకం అందజేసిందని, భారత్కు తిరిగొచ్చి దేశంలోని విద్యార్థులకు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా చేయడమే అతని ధ్యేయమన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్ను స్ఫూర్తిగా తీసుకుని పోస్టు డాక్టరేట్ కూడా చేయనున్నట్లు తెలిపారు. పరిశోధనల అనంతరం స్వదేశానికి వచ్చిన భరద్వాజ్తో తల్లిదండ్రులు, సోదరి -
జీవం పుట్టుకకు దారేదీ?
భూమ్మీద జీవం ఎలా పుట్టింది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సముద్రపు అడుగున పుట్టిందని కొందరు. అగ్నిపర్వత బిలాల్లోంచి ఆవిర్భవించిందని ఇంకొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. సుమారు 370 నుంచి 450 కోట్ల ఏళ్ల కింద ఆకాశం నుంచి కొన్ని ఉల్కల ముక్కలు వెచ్చటి, చిన్నసైజు నీటి కుంటల్లోకి పడటం జీవం పుట్టుకకు కారణమైందని తాజాగా మెక్మాస్టర్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని మ్యాక్స్ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై సముద్రాల మధ్య ఖండాలు ఏర్పడుతున్న సమయంలోనే భూమ్మీద జీవం ఏర్పడింది. ఉల్కా శకలాలతో పాటు మౌలిక పోషకాలు చేరడంతో ముందుగా తనంతట తాను పునరుత్పత్తి చేసుకోగల ఆర్ఎన్ఏ ఏర్పడిందని.. ఇది తర్వాతి కాలంలో జీవం ఆవిర్భవానికి దారితీసిందని కె.డి.పియర్స్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రంతో పాటు భూగర్భ, రసాయ, జీవ శాస్త్రాలన్నింటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. వెచ్చటి కుంటల్లోని నీరు ఆవిరి కావడం, మళ్లీ నీరు చేరడం వంటి సహజ ప్రక్రియల వల్ల ఉల్కా శకలాల ద్వారా నీటిలోకి చేరిన రసాయనాలు ఒకదానితో ఒకటి బంధం ఏర్పరచుకునేందుకు వీలేర్పడిందని తెలిపారు. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని ఆర్ఎన్ఏలు పరిస రాల్లోని పోషకాలను గ్రహించి మరిన్ని ఆర్ఎన్ఏలను ఉత్పత్తి చేయగలిగాయన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019