breaking news
-
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జిగా భూపేష్రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే. లోపాయికారి ఒప్పందం టీడీపీదే.... కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు. హవ్వా...ఓటమి భయమా..?! కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
కేసీఆర్పై ఏబీఎన్ తప్పుడు కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్డ్రైవ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. -
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్టాపిక్గా మారింది. భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ నానాయాగీ చేస్తోంది. ఇంకా అమల్లోకే రాని చట్టంపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండంతో ఏం చేయాలో తోచక సీఎం జగన్పై, ఆయన ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది.తాజాగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదంపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ చట్టంపై చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఆయన తిప్పికొట్టారు."ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?’ అని ట్వీట్ చేశారు..కాగా శుక్రవారం నాటి ఆంధ్రజ్యోతి ప్రతికలో ‘మీ భూమి మీది కాదు’ అనే నినాదంతో ఫస్ట పేజ్లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.దీనిని కృష్ణారావు షేర్ చేస్తూ.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీదేనని తెలిపారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలో ఏపీ బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం. ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024 -
ఫ్లాష్బ్యాక్.. నీచంగా మాట్లాడింది గుర్తుందా?
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా.. చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ... రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి. చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్లో మరీ డిజాస్టర్స్గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే.. చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సీఎస్ జవహర్రెడ్డి సీరియస్
సాక్షి, విజయవాడ: ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతలపై సీఎస్ ఖండన లేఖను విడుదల చేశారు. తన ఖండన ఈనాడు మొదటి పేజీలో ప్రచురించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారంటూ సీఎస్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు ఏసీఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది. అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి. అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం. ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు. తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా’’ అని సీఎస్ జవహర్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్ల సంఘం ఆగ్రహం పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్ల సంఘం మండిపడింది. ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలకు దిగాలని నిర్ణయించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని ఐపీఎస్ల సంఘం తేల్చి చెప్పింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈసీకి పురేందశ్వరి ఫిర్యాదు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది. ఇదీ చదవండి: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ.. -
టీడీపీకి గొయ్యి తీసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి..
-
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తన పరువుకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి చెత్త రాతలు రాసిందన్నారు. వారి రాతలపై కోర్టు వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, గ్రంధి శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులకు సొంత డబ్బు ఇచ్చి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాము. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలంటే 180 ఎకరాల భూమి కావాలి కానీ 75 ఎకరాల భూమిని దొరికింది. ఆంధ్రజ్యోతి పత్రికలో భూములు ఎక్కువ ధరలు ఇచ్చేసారని మా బంధువులకు తొమ్మిది కోట్ల రూపాయలు లాభం పొందామని అక్రమాలు చేశామని తప్పుడు రాతలు రాసుకొచ్చారు. మా పరుపుకి భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా బురద చల్లాల్నే రాతలు రాస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం నేరమా?.. వంద పడకల ఆసుపత్రికి నాలుగు ఎకరాలు మా సొంత భూమి ఇచ్చాము. జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం మా సొంత భూమి ఇచ్చాము. నన్ను డామేజ్ చేయాలని ఎన్నో అవాస్తవాలను రాసింది. ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. పూర్తి ఆధారాలతో కోర్టుకి వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. లేఅవుట్స్, మట్టి పూడికలు, బిల్డింగ్ పర్మిషన్ల అంశంలో నా ప్రమేయాలు ఉన్నట్లు వక్రీకరించారు. ప్రజలకు మేము సేవ చేయడం నేరమా?. వారు మా దగ్గరికి వచ్చి అడగటం నేరమా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు ప్లాట్లు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్లు జరగకపోతే వారి తరఫున నిలబడితే దీన్ని కూడావక్రీకరించారు. ప్రజలకు మంచి చేస్తున్నాము కాబట్టే.. ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాకు బాబు స్కామ్లు కనిపించవా? చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 850 ఎకరాల్లో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు. దీనిపై సీబీఐ విచారణ వేయమంటే మాకు సిబ్బంది లేరు అని నాడు వారు చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో అది ఆంధ్రజ్యోతికి కనపడదు. చంద్రబాబు అవినీతి లక్ష కోట్ల కుంభకోణం మీద ఎక్కడైనా రాశారా?. ఎల్లో మీడియా రైతులు, పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా రాతలు రాస్తుంది. చంద్రబాబును గద్దెనెక్కించడం కోసం.. అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా పనిచేసే మాలాంటి వారిని అల్లరి చేయాలని చూస్తున్నారు. దగా, వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మోసం చేయడం, దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు మామూలే. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావని చంద్రబాబుకు తెలిసింది. అందుకే అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలుస్తూ పొత్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. చెప్పాడంటే చేస్తాడు.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పచ్చ పైత్యానికి హద్దులు లేవు : కొమ్మినేని
-
వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి రాతలు..
-
బురిడీ కొట్టించడమే బాబు నైజం.. అంతా మాయే!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి సారిగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజ్ కారు ఇస్తానని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తానని చెబుతారని, అలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలకు చెబుతుండేవారు. కాని ఈసారి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం చెబుతూ సవివరంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాగ్దానాలలో ఎంత డొల్ల ఉన్నది ఆయన స్పష్టంగా తెలిపారు. తాను అమలు చేస్తున్న స్కీములకు డబ్బైరెండువేల కోట్ల వ్యయం అవుతోంందని, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అంతకు రెండు, మూడు రెట్ల వాగ్దానాలు చేస్తున్నారని, వాటికి లక్షాపాతికవేల కోట్ల నుంచి లక్షాఏభై వేల కోట్ల వ్యయం అవతుందని, అప్పుడు ఏపీ ఎన్ని శ్రీలంకలు అవ్వాలని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నుంచికాని, ఆయనను భుజాన వేసుకుని మోసే మీడియాల నుంచి కాని సూటిగా సమాదానం లభించదు. చంద్రబాబు సంపద సృష్టించి స్కీములు అమలు చేస్తారని బొల్లుతుంటారు. దానిని చాలా స్పష్టంగా రుజువు చేస్తూ జగన్ అసెంబ్లీలో అంకెలను ప్రదర్శించి మరీ తెలియచెప్పారు. ఈ మాట అంటుంటే ఒక సంగతి గుర్తుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసివేశారు. అవన్ని నిరర్దకమని, నష్టాలు తెచ్చేవని అప్పట్లో ప్రభుత్వపరంగా చెప్పేవారు. అలాగే విద్యుత్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. వాటివల్ల ప్రజలపై భారం పెరిగేది. ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వాలంటే పలు షరతులు పెట్టేది. విద్యుత్ రంగంలో నష్టాలు తగ్గించాలని, రేషన్ కార్డులు కట్ చేయాలని, నష్టాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎత్తివేయాలని ..ఇలా పలు కండిషన్ లు పెడితే అందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో కూడా ఆయన ఇదే సంపద సృష్టి అంటూ బడాయి పదాలు వాడేవారు. విద్యుత్ సంస్కరణల వల్ల చాలా సొమ్ము ఆదా అవుతుందని,దానిని పేదలకు వ్యయం చేస్తామని అనేవారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చేవారు. దీనిపై చంద్రబాబు విమర్శిస్తూ,అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత పెరిగి 2004 ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైంది. ఉమ్మడి ఏపీలో 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులోను తెలంగాణలో అతి తక్కువగా 11 సీట్లే టీడీపీకి దక్కాయంటే ఏ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత రోజులలో ఆయన అన్ని విషయాలలో యుటర్న్ తీసుకున్నారు. ఉచిత విద్యుత్ ను తాను కూడా ఇస్తానని చెప్పేవారు. అంతెందుకు ..ఈ మధ్యకాలంలో కేంద్రం చేసిన సూచన ప్రకారం వ్యవసాయ మోటార్లకు జగన్ ప్రభుత్వం మీటర్లు పెట్టి, వారు వినియోగించే విద్యుత్ కు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంది. దానిని కూడా చంద్రబాబు తప్పుపట్టి ,మీటర్లు అంటే రైతులకు ఉరి వేయయడమే అంటూ దిక్కుమాలిన ప్రచారం చేశారు. అంటే ఆయన తాను సంస్కరణవాదినని చెప్పుకునేది అంతా బోగస్ అని రుజువు చేసుకున్నారు. అదే కాదు. రైతు రుణమాఫీ అమలు చేస్తానని 2014లో హామీ ఇచ్చి ,తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. 89 వేల కోట్ల రూపాయల రుణాలకు గాను పదిహేనువేల కోట్ల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు వల్ల రైతులు రుణాల బారిన పడి బాగా నష్టపోయారు. ఇలా ఒకటేమిటి! సుమారు ఆరువందల హామీలు ఇచ్చి ,మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. దానిని గమనించిన ప్రజలు టీడీపీని 2019లో కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఈ నేపద్యంలో విశ్వసనీయత అంశాన్ని జగన్ ప్రస్తావించి, మాట ఇస్తే తప్పకుండా అమలు చేయాలని, చంద్రబాబు లా మోసం చేయకూడదని అన్నారు.కాని బాబు స్యూరిటీ,భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఒక డైలాగును తీసుకుని తెలుగుదేశం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పాయింట్ ను జగన్ వివరిస్తూ మహిళా శక్తి కింద ప్రతి మహిళకు ఇచ్చే 1500 రూపాయల స్కీము ఒక్కదానికే 36వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఒకప్పుడు ఏది ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే అన్నీ ఉచితం అంటారు. అదే ప్రకారం 2024 ఎన్నికలు తెలుగుదేశం భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో , ఎన్ని వీలైతే అన్ని అబద్దపు వాగ్దానాలను చేస్తూ ప్రచారం కావిస్తున్నారు. వీటిని జనం నమ్మరు. అయినా కొందరు అమాయకులు విని మోసపోయే అవకాశం ఉండడంతో జగన్ ఆ విషయాలను ప్రస్తావించి చంద్రబాబు ట్రాక్ రికార్డు చూడాలని ప్రజలను కోరారు. తాను ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేశానని జగన్ చెప్పారు. తాను కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదని, పలు అబివృద్ది పనులను చేపట్టామని, పోర్టుల నిర్మాణం తదితర పెట్టుబడి వ్యయం గురించి వివరించారు. సంపద గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు టైమ్ లో జీఎస్డీపీ కన్నా, తన పాలన టైమ్ లో పెరిగిన జీఎస్డీపీ శాతాన్ని గణాంకాలతో సహా తెలియచెప్పారు. సంపద అంటే ఒక మాట చెప్పుకోవాలి. జగన్ పేద ప్రజలందరికి వివిద స్కీములు అమలు చేయడం ద్వారా వారికి సంపద సృష్టించారు. ఉదాహరణకు 31 లక్షలమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలం విలువ కనీసం రెండు లక్షల రూపాయల నుంచి గరిష్టంగా పది లక్షలపైనే ఉంటుంది. ఆ ప్రకారం ఆ కుటుంబాలకు ఆస్తి సమకూరినట్లే. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. తద్వారా వారి ఆస్తి విలువ పెరుగుతుంది. మరి చంద్రబాబు కనీసం ఒక్కరికైనా ఇళ్ళ స్థలం ఇచ్చారా అన్నదానికి జవాబు దొరకదు. అయితే ఆయన అమరావతి ప్రాంతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడడం కోసం తన శక్తియుక్తులన్నీ వాడారని చెప్పాలి. తన అనుచరులు ఇన్ సైడ్ ట్రేడింగ్ కుపాల్పడడం ద్వారా లాభపడ్డారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికి సంపద సృష్టించింది జగన్ అయితే, కేవలం ధనికులకే సంపద పెంచే యత్నం చేసింది చంద్రబాబు అని అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు బలం ఎల్లో మీడియా అని అంటూ, ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు తెలుగుదేశం కోసం పనిచేస్తూ చెప్పిన అబద్దం చెప్పకుండా ప్రచారం చేస్తున్నాయని జగన్ చెప్పారు. ఇది కూడా పచ్చి నిజం. రోజూ ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణలు పోటీపడి తమ సిబ్బంది తో దారుణమైన అబద్దాలు రాయిస్తున్నారు. టీవీలలో ప్రసారం చేయిస్తున్నారు. ఈ దుర్మార్గపు మీడియాను ఎదుర్కోవడం కూడా జగన్ ముందు సవాలుగా మారింది. అప్పులు,పొత్తులు వంటి విషయాలపై కూడా జగన్ చాలా వివరంగా చెబుతూ నిశితమైన విశ్లేషణ చేశారు. జగన్ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరతామని ధీమా వ్యక్తంచేస్తూ జూన్ లో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు తెలియచేయడంలో ఈ స్పీచ్ ద్వారా జగన్ సఫలం అయ్యారని చెప్పవచ్చు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Live Show: నేటి ఆంధ్రజ్యోతి, ఈనాడు అబద్ధాలు
-
పూర్తిగా అమ్ముడుపోయిన రామోజీ, రాధాకృష్ణ
ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి.. ఈనాడు దినపత్రికలో కొద్ది రోజుల క్రితం పెద్ద అక్షరాలతో బానర్ కధనం. బాగానే ఉంది. తప్పు లేదు. ఇక్కడ నిజంగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా?కాదా? అన్న మీమాంసలోకి ఈనాడు వెళ్లలేదు. అలాగే మరో పత్రిక ఆంధ్రజ్యోతి తెలంగాణలో అంతకన్నా పెద్ద హెడింగ్ తో పదిహేనువేల పోలీస్ ఉద్యోగాలు అంటూ వార్త ఇచ్చింది. ఈ పత్రికలు తెలంగాణలో ఎలా ఉన్నాయో, ఏపీలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడడానికి ఇది పెద్ద ఉదాహరణ అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వంలో భర్తీ చేస్తే , ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమని ప్రచారం చేస్తాయి..ఏపీలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని. ఇంత తేడా ఎందుకు?అంటే తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భుజాన వేసుకున్నందుకే అని చెప్పనవసరం లేదు. ✍️ఏపీలో తెలుగుదేశం కోసం పచ్చి అబద్దాలు రాయలని ఈ రెండు మీడియా సంస్థలు, మరికొన్ని తెలుగుదేశం చానళ్లు కంకణం కట్టుకుని పని చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉత్సాహంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పినా ,అది అంత తేలికకాదు. నిజంగానే ఆయన చెప్పినట్లు జరిగితే మంచిపేరే వస్తుంది. కాని ప్రభుత్వంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని జాబ్స్ ఇవ్వగలుగుతారు?తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నిటిని ఫిల్ చేయవచ్చు? అసలు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక, ఎంత వ్యవదిలో పరీక్షలు ,ఇంటర్వ్యూలు పూర్తి అవుతాయి..మొదలైనవాటన్నిపై ఒక అవగాహనతో ఇలాంటి విషయాలు మాట్లాడాలి. కాని రేవంత్ అలా చేసినట్లు అనిపించదు. ఏపీలో వైఎస్ జగన్ లక్షముప్పైవేల ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వగలిగారు. దానికి కారణం అక్కడ ఆయన అందుకు తగ్గట్లు వ్యవస్థలను ఏర్పాటు చేయడమే. ఏపీ అంతటా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఆయన తీసుకు వచ్చారు. ✍️ప్రతి సచివాలయంలో సుమారు పది ఉద్యోగాలు కల్పించి వారి ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. వాటికి అనుబందంగా సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. రేవంత్ కూడా వలంటీర్ల వ్యవస్థ తెస్తానని గతంలో చెప్పారు. అది చేయాలంటే గ్రామ,వార్డు స్థాయిలో వ్యవస్థ ఉంటేనే వలంటీర్లతో ప్రయోజనం ఉంటుంది. మరి ఇవేవి లేకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారో తెలియదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల వ్యవహారంలో తెలంగాణ ప్రజలలో అసంతీప్తి మొదలవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలు చేస్తున్నా, దాని వల్ల కాంగ్రెస్ కు పూర్తి ప్రయోజనం వస్తుందా?రాదా? అన్నది చెప్పలేం.అలాగే ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచినా తక్షణం ప్రజలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ✍️ఇవి కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేస్తామని, మహిళలకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు,రైతు బందు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దళితులకు పన్నెండు లక్షల సాయం వంటి అనేక హామీలు పెండింగులో ఉన్నాయి. అవి నెరవేరాలంటే ఎంత బడ్జెట్ కావాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఈ నేపద్యంలో ప్రజలలో అలజడి పెరగకుండా ఉండేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలో ఈ గ్యారంటీల ప్రభావం పడకుండా ఉండేందుకు ,నిరుద్యోగులలో అశాంతి నెలకొనకుండా ఉండడానికి రేవంత్ ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఉండవచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఈ గ్యారంటీల గురించి చెబుతామని అంటున్నారు. అది ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ✍️ ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ గ్యారంటీల కోసం ప్రజలు లక్షల సంఖ్యలో క్యూలలో నిలబడి దరఖాస్తులు చేసుకున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్రక్రియగా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే, ఈనాడు,ఆంద్రజ్యోతి ఎలాంటి విశ్లేషణాత్మక కధనాలు ఇవ్వకుండా రేవంత్ కు జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నించాయి.ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈనాడు ఇదే రీతిలో ప్రచారం చేసేది. అంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేక వార్త రాయలంటే వణికే తెలుగుదేశం మీడియా ,ఏపీ లో మాత్రం ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రికి అనుకూలంగా వార్తలు ఇచ్చినా ఫర్వాలేదు. ముఖ్యమంత్రి ప్రకటనను ఇవ్వడం ఆక్షేపణీయం కాదు. కాని అదే ఏపీకి వచ్చేసరికి లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు అంత కక్ష కట్టి పచ్చి అబద్దాలు రాస్తున్నాయన్నదే ప్రశ్న. ✍️ఆరువేల టిచర్ పోస్టులకు గాను డిఎస్సిని ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తే దానిని దగా కింద ప్రచారం చేశాయి.ఈ టీచర్ పోస్టుల ప్రకటనలో కాస్త ఆలస్యం అయితే అయి ఉండవచ్చు. అంతవరకు రాసినా ఓకే. కాని ఉన్నవి,లేనివి కలిపి అసత్యాలు వండి వార్చి ప్రజలను మోసం చేయడానికి యత్నించారు. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిసిన ఐబి సిలబస్ ను ప్రవేశపెట్టడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మొదటి పేజీలో కనీసం ఒక లైన్ రాయడానికి వీరికి చేతులు రాలేదు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్ముతూ ఈ మీడియా సంస్థలు పలు కధనాలు ఇచ్చాయి. ✍️ చివరికి పిల్లల చదువకు ఉపయోగపడే టాబ్ లు ఇచ్చినా ఈనాడు రామోజీరావు తెగ బాధపడిపోయారు. పరిశ్రమలను తరిమేస్తు్న్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర టీడీపీ మీడియా సంస్థలు అరవైవేల కోట్ల ఇండో సోలార్ పానెల్ ప్రాజెక్టుకు భూమి కేటాయిస్తే,దానిపై విషం చిమ్ముతూ వార్తలు రాశారు. ఇలా ప్రతి రోజు ఈ పత్రికలు, టివిలు నెగిటివ్ వార్తలు రాసి ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నాయి. ✍️కేవలం తమ మాట వినే చంద్రబాబును సీఎంను చేయడం కోసం ఏపీ ప్రజలకు నష్టం కలిగేలా ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఏపీ ప్రజలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి శాపంగా మారాయంటే అసత్యం కాదు. విద్యార్ధులకు సంబంధించిన విషయాలలో కూడా దారుణమైన స్టోరీలు ఇస్తూ టాబ్ లపై కూడా ఏడ్చిపోయారు. ఏది ఏమైనా తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వార్తలు ఇచ్చే ఈనాడు,ఆంధ్రజ్యోతి మీడియాకు ఏపీప్రజలు ఎలా బుద్ది చెబుతారో చూడాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పూర్తిగా బ్రోకర్లుగా మారిపోయిన రామోజీరావు,రాధాకృష్ణ..!
-
YSRCP నేతలపై తప్పుడు వార్తలు రాయడమే ఏబీఎన్ పని: గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
పచ్చ వార్తలతో లోకమంతా పచ్చగా చేసే ప్రయత్నం
-
KSR లైవ్ షో: నేటి ఆంధ్రజ్యోతి అబద్ధాలు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి బిగ్ షాక్
-
భోగిమంటల్లో బూడిదైన ఆంధ్రజ్యోతి, ఈనాడు
-
వామ్మో ‘ఎల్లో' వైరస్.. తస్మాత్ జాగ్రత్త!
శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఈనాడు రామోజీరావు దగ్గర సలహాలు తీసుకోవాలి కాబోలు. వైఎస్సార్సీపీ రెండో జాబితాలో చేసిన మార్పులు, చేర్పులపై ఈనాడు ఒక చెత్త కథనాన్ని వండింది. ✍️ఇన్ చార్జీల నియామకంపై పద్దతి ప్రకారం సమీక్షిస్తే తప్పుకాదు. కాని నీచమైన రీతిలో ప్రతిదానిని తప్పుపడుతూ ఒకసారి, ఒకదానికిఒకటి విరుద్దంగా మరోసారి కథనాలు ఇస్తున్న తీరు చూస్తే, వీరు పత్రికలు నడపడం కంటే తెలుగుదేశం కరపత్రిక నడపడం బెటర్ అని చెప్పవచ్చు. వైసీపీ సీట్ల మార్పిడిలో బడుగు, బలహీనవర్గాలే బలి అని ఒక తప్పుడు వార్తను ఈనాడు పత్రిక అచ్చేసింది. ఈ వార్త చదివితే నిజంగానే ఈనాడు అచ్చోసిన ఆంబోతు మాదిరి తయారై పాఠకులను బెంబేలెత్తిస్తోందని అర్ధం అవుతుంది. ✍️ఆ పత్రిక చదివేవారి సహనాన్ని మెచ్చుకోవాలి. ఇంత ఛండాలంగా కూడా పత్రిక నడపవచ్చా! వార్తలు రాయవచ్చా! అని అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా టూర్లలో కాని, ఆయన కుమారుడు లోకేష్ యువగళంలో కాని పలువురు టీడీపీ అభ్యర్ధులకు టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు కనుక ఆయన ప్రకటన చేశారనుకున్నా, లేదా ఇన్చార్జీల నియామకం చేశారన్నా అర్ధం చేసుకోవచ్చు. ✍️అందులో తప్పొప్పుల సంగతి వేరే విషయం. కాని ఏ అధికారంతో లోకేష్ ఆయా చోట్ల ఫలానా వ్యక్తి తెలుగుదేశం అభ్యర్ధి అని ప్రకటిస్తూ వచ్చారు? అంటే అది పెత్తందారి ధోరణి కాదా! ఈనాడుకు అది ఎంత కమ్మగా కనిపించిందో! అంతేకాదు.. ఈ ఇద్దరు నేతలు ఆయా చోట్ల తిరుగుతూ దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలందరిపైన ఎలాంటి ఆరోపణలు చేశారు?వాటిలో నిజం ఉన్నా, లేకపోయినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి పెద్ద,పెద్ద అక్షరాలతో రాసి, టీవీలలో చూపి ప్రచారం చేశాయి కదా! వారి ఆరోపణలే కాదు. ఇప్పటికీ ఈ ఎల్లో మీడియా పత్రికలు,టీవీలు రోజూ వైసిపి ఎమ్మెల్యేలపై అనేక తప్పుడు వార్తలు ఇస్తున్నాయి కదా! వారిలో కొందరిని పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా మార్చితే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి మెచ్చుకోవాలి కదా! ఇప్పుడు కూడా ఎందుకు ముఖ్యమంత్రి జగన్పై పడి ఏడుస్తున్నారు? అంటే వీరు ఆశించిన విధంగా ఎవరిని మార్చకపోతే, అప్పుడు ఇంకేముంది.. కేసీఆర్ ఇలాగే మార్చలేదు. ఓడిపోయారు..ఇప్పుడు జగన్ పని అంతే అని ప్రచారం చేసేవారు. ✍️ఆయన మార్చుతుండేసరికి రాగం మార్చి అమ్మో అంత మందిని మార్చుతారా? ఇంత మందిని మార్చుతారా అని తెగ వాపోతున్నారు. అసలు వీరికి బుద్ది, జ్ఞానం లేదని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. ఎస్సీ,ఎస్టీ రిజర్డ్డ్ నియోజకవర్గాలలో కొందరిని మార్చితే బలహీనవర్గాలవారికి అన్యాయం జరగడం ఏమిటి?. కనీస ఇంగితం అయినా రామోజీరావుకు, రాధాకృష్ణకు ఉందా? ఆ నియోజకవర్గాలలో ఎస్సీ వారిని కాకుండా వేరే వారిని అభ్యర్ధులుగా చేయగలుగుతారా?. రేపు చంద్రబాబు నాయుడు ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్ధులను మార్చితే అలాగే ప్రచారం చేస్తారా? అప్పుడేమని రాస్తారంటే చంద్రబాబు కాబట్టి, ఆయన అన్ని సర్వేలను దగ్గర పెట్టుకుని ప్రజాభిప్రాయం మేరకు మార్చారని వండుతారు. ✍️గత ఎన్నికలలో పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత ను కొవ్వూరు సీటుకు ఎందుకు మార్చారు. కొవ్వూరులో ఉన్న మంత్రి జవహర్ను తిరువూరుకు ఎందుకు తీసుకు వచ్చారు? తిరువూరులో ఉన్న ఎస్సి నేతను ఎందుకు గాలికి వదలివేశారు? దీనికి రామోజీ, రాధాకృష్ణలు సమాధానం ఇవ్వగలరా?వైసీపీ ఎమ్మెల్యే ఎమ్.ఎస్.బాబు ఏదో అన్నారట. అది ఇప్పుడు వారికి మహా ప్రసాదం అయింది. అదే ఎమ్మెల్యేపై లోకేష్ ఎన్ని విమర్శలు చేశారు? అయినా ఆయననే కొనసాగించాలని ఇప్పుడు ఈనాడు మీడియా రాయడంలోని దురుద్దేశం అర్ధం కాదా? ✍️ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలను మార్చి బీసీ, ముస్లిం వర్గం నేతలకు జగన్ టిక్కెట్ ఇస్తే, రామోజీ, రాధాకృష్ణ వంటి తెలుగుదేశం ఏజెంట్లకు కనిపించలేదా? మంగళగిరి, ఎమ్మిగనూరులలో చేనేత వర్గం నేతలు చిరంజీవులు,మాచాని వెంకటేష్లకు, కదిరిలో ముస్లిం మైనార్టీకి టిక్కెట్లు ఇస్తే కూడా ఏడుపేనా! మంత్రి అమరనాథ్కు టిక్కెట్ ఇవ్వకపోయినా, ఆయనేమీ బాధపడలేదు. పైగా తాను వైసీపీకి ప్రచారం చేస్తానని చెబుతున్నారు. దానిని మాత్రం పట్టించుకోరు. మరో మంత్రి వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చి టిక్కెట్ ఇచ్చినా వీరికి బాధగానే ఉంది. రామచంద్రపురంలో ఆయన బదులు మరో బిసి వ్యక్తికే టిక్కెట్ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ లో అగ్రవర్ణం బదులు బీసీ వ్యక్తిగా వేణుకు టిక్కెట్ లభించింది. దానిని మాత్రం చెప్పరు.ముగ్గురు ఎంపీలను మార్చారట. ఎల్లో మీడియాకు అది కూడా తప్పుగానే కనిపించింది. ✍️పోనీ వారి బదులు వేరేవారికి ఇచ్చారా అంటే అదేమీ కాదు. మళ్లీ బీసీ, ఎస్టీ నేతలకే టిక్కెట్లు లభించాయి. వైఎస్అ వినాష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేస్తున్నారని ఒకటే రొద చేస్తున్నారు. ఆయనపై వివేకా హత్య కేసులో ఆరోపణలు వచ్చాయి కనుక టిక్కెట్ ఇవ్వకూడదని అన్నారు. మరి ఇదే సూత్రం టీడీపీకి వర్తించదా! మాజీ మంత్రి పరిటాల రవిపై ఎన్ని హత్యకేసులు ఉన్నాయో రామోజీ,రాధాకృష్ణలకు తెలియదా? అయినా ఎందుకు అప్పట్లో టీడీపీ టిక్కెట్ పలుమార్లు ఇచ్చారు? పరిటాల రవి హత్యకేసులో స్వయంగా ఆయన భార్య సునీత మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డిపైనే ఆరోపణలుచేశారే. అయినా 2014లో చంద్రబాబు నాయుడు ఎలా ఎంపీ టిక్కెట్ ఇచ్చారు? వైసీపీలో ఉన్న గౌరు వెంకటరెడ్డి ఒక హత్యకేసులో జీవిత శిక్ష అనుభవించారు. ఆ టైమ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఆయనను పరామర్శించడానికి వెళితే చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టి ప్రచారం చేశారే!. అలాంటి వ్యక్తిని టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారు. ఆయన భార్యకు ఎలా టిక్కెట్ ఇచ్చారు? అంటే చంద్రబాబు ఏమి చేసినా సమర్ధించడం,జగన్ ఏమి చేసినా తప్పుడు ప్రచారం చేయడం. ✍️ఇదే నిత్యకృత్యంగా పెట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలను జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లినా టిక్కెట్ ఇవ్వలేదని ఈనాడు ఏడ్చింది. ఒకే! మరి అదే విధంగా వైసీపీ నుంచి వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లేదా మరొకరికి ఎవరికైనా టిడిపి టిక్కెట్ ఇవ్వకపోతే ఇలాగే ఏడుస్తారా? వార్తలు రాయకుండా ఏడుపుగొట్టుతనంతో స్టోరీలు ఇస్తున్న తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోంది. ✍️అయినా వారి తీరుమారడం లేదు.ఇంకో చిత్రమైన సంగతి. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన ఈనాడు మీడియా, మళ్లీ ఆయన చెప్పినవారికే టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తోంది? ఆయన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారట.ఈ గొడవలన్ని ఎందుకు! వైసిపి వారు ముందుగా తాము ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నది జాబితా సిద్దం చేసి రామోజీకి పంపితే ఆయన ఆమోద ముద్ర పడిన తర్వాత ప్రకటించాలేమో! ప్రస్తుతం జగన్ తన పార్టీతో వారితో మాట్లాడుకుంటూ, తన వద్ద నివేదికల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనసాగించినా ఈనాడు మీడియా ఇలాగే చెత్తగా రాస్తుంది. కొనసాగించకపోయినా ఆయా నేతలను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ✍️ఇదంతా దేనికి ?తన ఎదుట కూర్చుని జీహుజూర్ అనే చంద్రబాబు కోసమే కదా? రామోజీరావు, రాధాకృష్ణలే పెత్తందారి బూర్జువా మనస్తత్వంతో దారుణంగా ఏపీ సమాజానికి శత్రువులుగా మారారు. ఇంతవరకు టీడీపీ, జనసేనల సీట్ల పంపిణీపై ఒక అవగాహనకురాలేదు. టీడీపీలో గతసారి పోటీ చేసిన ఎంతమందికి టిక్కెట్లు ఇస్తారో తెలియదు.టీడీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకున్నా కప్పిపుచ్చుతున్నారు. టీడీపీలో ఆయా చోట్ల రెండు,మూడు వర్గాలు ఘర్షణలుపడినా దాచేస్తున్నారు. తిరువూరులో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు తన్నుకున్నా దానిని జిల్లా పేజీకే పరిమితం చేసి మిగిలిన రాష్ట్రానికి తెలియకుండా చేయాలనుకున్న విషయం అర్ధం కాదా? ✍️జగ్గంపేటలో టీడీపీ, జనసేనలు ఎలా ఘర్షణ పడ్డాయన్నది బహిరంగ రహస్యమే అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆ వార్తలను మొదటి పేజీలో ఎందుకు ఇవ్వలేదు?సోషల్ మీడియాలో ఇవన్ని క్షణాలలో వచ్చేస్తున్నాయి కదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాబినెట్ లో ఏకంగా పదిహేడు మంది బలహీనవర్గాలవారికి అవకాశం ఇచ్చారు కదా! ఎన్నడైనా మెచ్చుకున్నారా? ✍️రాష్ట్రంలో ఉన్న వివిద పదవులలో ఏభై శాతం బడుగువర్గాలకు ఇచ్చిన నేత జగన్ కాకుండా మరెవరైనా ఉన్నారా? వాటినీ ఇంకో రకంగా తప్పుపడుతూ, తమ అగ్రవర్ణ దురహంకారాన్ని ఎల్లో మీడియా పెద్దలు ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూనే ఉన్నారు. జనం వీటిని గమనిస్తూనే ఉన్నారు. టిక్కెట్ల సమయంలో అన్ని పార్టీలలోను నిరసనలు ఉంటాయి.కాని వైసీపీలోనే ఇలాంటివి ఉన్నట్లు చెత్త రాతలు రాస్తున్న ఎల్లో మీడియా తీరే ఘోరంగా ఉంది.ఒక పద్దతి, పాడు లేకుండా విశ్లేషణలు ఇస్తున్న వీరి వైనం నీచాతినీచంగా ఉంది. అందువల్లే ఈనాడు, జ్యోతి వంటి వాటిని ఎల్లో వైరస్ గా జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. ఇదీ చదవండి: చంద్రబాబుకు చెక్!.. కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
పిల్లలు ఆడుతుంటే.. రామోజీ, రాధాకృష్ణకు వచ్చిన నొప్పి ఏంటో?
ఏపీలో ఈనాడు మీడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై పడి తెగ ఏడుస్తోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే యువత, ఇతర వర్గాలవారికి ఆటల పోటీలు పెట్టినా సహించలేనంతవరకు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో యువతకు ఆటల పోటీలు పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. నిజానికి ఇది సరికొత్త ట్రెండ్ అని చెప్పాలి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి యత్నించలేదు. తప్పుడు వార్తలతో వదంతులు దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహించాలని తలపెడితే దానిని ఎలా చెడగొట్టాలా అన్న ధ్యేయంతో ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి మరీ నీచంగా ప్రచారం చేశాయి. మొదట ఆట స్థలాలు ఏవి అని కథనాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆట స్థలాలు బురదతో నిండి ఉన్నాయని తప్పుడు ఫోటోలు వేసి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. ఆ తర్వాత ప్రజలు ఈ ఆటలలో పాల్గొనడం లేదని, వలంటీర్లు ఈ ఆటలను బహిష్కరించారని వదంతులు సృష్టించారు. ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు అసలు ఏపీలో పిల్లలు అడుకుంటే రామోజీరావుకు, రాధాకృష్ణకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఒక్కసారే యువతలో క్రీడల పట్ల ఆసక్తి ఏర్పడుతుందని, తద్వారా ముఖ్యమంత్రి జగన్కు మంచి పేరు వస్తుందన్న ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు. ఆటల విషయంలో తెలుగు రాష్ట్రాలుబాగా వెనుకబడి ఉన్నాయన్నది ఒక అభిప్రాయం. దానిని దృష్టిలో ఉంచుకుని జగన్ మొత్తం అందరిని ఆటలవైపు మళ్లించడానికి ఒక యత్నం చేశారు. అంతే.. తెలుగుదేశం మీడియాకు ఏదో సందేహం వచ్చేసింది. యువత అంతా జగన్కు జై కొడుతుందేమో అన్న భయం పట్టుకుంది. అందుకే యవత, ప్రజలు ఎవరూ ఆటలలో పాల్గొనడం లేదని, లక్షలలో నమోదు చేసుకున్నా రావడం లేదంటూ ఈనాడు మీడియా తనదైన శైలిలో తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేసింది. గత ప్రభుత్వం హ్యాపీ సండే అంటూ ఒకటి, రెండు నగరాలలో స్టేడియం వద్దో, రోడ్లపైనో స్టేజీ కట్టి చెవులు పగిలేలా డ్రమ్స్ పెట్టి డాన్స్లు వేయిస్తే అదేమో గొప్ప విషయంగా ఇదే మీడియా అప్పట్లో ప్రచారం చేసింది. ఎల్లో మీడియాకే చెల్లింది ఆటలకు సంబంధించి ప్రభుత్వం ఇంకేమి చర్యలు తీసుకోవాలి! ఎలా అభివృద్ది చేయాలన్నదానిపై వార్తలు రాస్తే తప్పు లేదు. అలా కాకుండా ఇలాంటి చెత్త వార్తలను రాయడం. అది కూడా మొదటి పేజీలో అచ్చేసి తన రాక్షస మనస్తత్వం బయటపెట్టుకోవడం ఈ ఎల్లో మీడియాకే చెల్లింది. ప్రతిదానిలోను రాజకీయం చూడడం,ప్రభుత్వంపై పడి నిత్యం రోధించడం ఇదే కార్యక్రమంగా ఈనాడు పెట్టుకుంది. ఒకప్పుడు స్కూళ్ల, కాలేజీలలో క్రీడా పోటీలు జరిగేవి. జోనల్ పెద్దతిలో కూడా పోటీలు ఉండేవి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అవి ఉన్నా, గత ప్రభుత్వాలు అంత శ్రద్ద చూపకపోవడంతో స్థానికంగా వ్యాయామ ఉపాధ్యాయుల ఆసక్తిపైనే ఇవి నడుస్తున్నాయి. ఏడుపు మొహంతో వార్తలు రాయాలా? విద్యా సంస్థలలో కూడా ప్రైవేటు రంగం విస్తృతంగా వ్యాప్తి చెందాక, అసలు ఆట స్థలాలు లేకుండానే అవి ఏర్పాటవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఎంతసేపు తమ పిల్లలు ఎంసెట్, ఐఐటి, మెడిసిన్ వంటివాటిలో ఎలా సీటు సంపాదించాలన్నదానిపైనే దృష్టి పెట్టడం అలవాటైపోయింది. విద్యార్థులే కాకుండా, ఆయా గ్రామాలలో, పట్టణాలలో యువత, లేదా మధ్య వయసువారు ఆటలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాలకు ఆటలలో పాల్గొనే అవకాశం కల్పిస్తే దానికి కూడా ఈనాడు ఏడుపు మొహంతో వార్తలు రాయాలా? అదేదో తప్పు పని చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు ఉన్న గ్రామ,వార్డు సచివాలయాలను, వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా వాడుకోవాలని తలపెట్టింది. అయినా ఆటలు ఆగలేదు నిజానికి గతంలో ఇంత సూక్ష్మ స్థాయిలో ప్రజలను క్రీడలలలో ఇన్వాల్వ్ చేసే అవకాశం లేదు. కొత్త వ్యవస్థలతో అది సులువు అయింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న లక్ష్యంతో ఉన్న ఈనాడు, జ్యోతి వంటి మీడియా వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు, ఆడుదాం ఆంద్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించింది. అయినా ఆటలు ఆగలేదు. ఆటలలో గెలిచినవారికి బహుమతులుగా ఆటలకు సంబంధించిన కిట్లను, నగదు తదితరాలు అందచస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ క్రీడా సంబరాన్ని ఆరంభించారు. వారిది నీచమైన ఆలోచన దీనిని బాగా వినియోగించుకుని ప్రజలు తమ మానసిక ఉల్లాసానికి అవసరమైన క్రీడలలో పాల్గొనాలి. ప్రభుత్వం ఆడిస్తోంది కాబట్టి ఎవరూ రాకూడదన్నది రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి నీచమైన ఆలోచన. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక ఇలాంటి ఆలోచన చేసి ఉంటే, అబ్బో మా బాబు ప్లాన్ అదిరింది. ప్రజలంతా అన్ని పనులు మానుకుని ఆటలలో పాల్గొంటున్నారని ప్రచారం చేసేవారు. చంద్రబాబుకు రాని ఆలోచనలు జగన్కు వస్తుండడం, ప్రజలకు మేలు చేసేవి, ఉపయోగపడేవాటిని జగన్ ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు సాగుతుండడంతో వారికి పాలుపోవడం లేదు. ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా? ఆయా కార్పొరేట్ స్కూళ్లు,కాలేజీలు ఎక్కడైనా ఆటలను ప్రోత్సహించడానికి వీలుగా మైదానాలను మెయిన్ టెయిన్ చేస్తున్నాయా అన్నదానిపై ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా అంటే అలా చేయదు. ఎందుకంటే వారితో మాచ్ ఫిక్సింగ్ కనుక. వారితో వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి కనుక. వాటి గురించి రాయకపోతే రాయకపోయారు. ఇప్పుడు మాత్రం విషం చిమ్మతుంటారు. ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో ఆట స్థలాలను చంద్రబాబు హయాంలో ఎన్నడైనా అబివృద్ది చేశారా? నిజంగా అలా చేసి ఉంటే,ఇప్పుడు స్థలాలు లేవు అని ఎల్లో మీడియా ఎందుకు కథనాలు రాస్తోంది. ఏడవాల్సిన అవసరం ఏముంది? వాటిని ఎవరైనా ఎత్తుకుపోయారా! చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్లు, జగన్ ఉంటే అక్కడ ఏమీ లేనట్లు రాయడం వీరికి అలవాటుగా మారింది. ఇంత దుర్మార్గంగా మీడియా మారడం ఇప్పుడే చూస్తున్నాం. జగన్ ప్రభుత్వం ప్రజలలో క్రీడా స్పూర్తి పెంచడం కోసం ప్రయత్నిస్తుంటే రామోజీ, రాధాకృష్ణ వంటివారు ఏడవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో చోట మొదలు పెడితే కదా.. బాగా ఆడే యువతను కనిపెట్టగలిగేది. వారిని ప్రోత్సహించేది. అసలేమీ చేయకుండా ఉంటే అప్పుడు ఏమి రాస్తుంటారు. క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇంకేదేదో చెత్తంతా రాస్తారు. జగన్ ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇచ్చిందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకూడదన్న దురుద్దేశంతో విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదారి పట్టించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. ఈ ఆటల పోటీల ద్వారా ఆణిముత్యాలను గుర్తించాలన్న జగన్ సంకల్పం మెచ్చుకోదగిందే. ఈ ఎల్లో మీడియా ఎంత ఏడ్చినా జగన్ పట్టించుకోకుండా తను ఎంచుకున్న దారిలో వెళ్ళి ప్రజల ఆదరణ పొందుతున్నారు. అదే ఆయన బలం. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఈనాడు, ABNపై ఏపీ వాలంటీర్ల ఫైర్
-
తప్పుడు రాతలను నిరసిస్తూ గుంటూరు ఈనాడు ఆఫీసు ముందు ధర్నా
Pagination
Advertisement
test notififications
nhbgty
terst
Test article qid_26062024
re test
test article11
test notifications n1
test prod issue
test article n1 beta m
test article n1
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement