
తెలుగు చలనచిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గరిమెళ్ల విశ్వేశ్వరరావు(62) అనారోగ్యంతో కన్నుమూశారు.

తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించి హాస్యనటుడిగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. కాకినాడలో గరిమెళ్ల కృష్ణమూర్తి-తాయారమ్మల ఏడో సంతానం విశ్వేశ్వరరావు.

అందరికంటే చిన్నోడు. కానీ తండ్రి మరణానంతరం ఇతడే తండ్రయ్యారు. సంపాదించడం మొదలుపెట్టి అందరి బాధ్యతను భుజాన వేసుకున్నారు.

పొట్టిప్లీడరు సినిమాలో తొలిసారి నటించారు. చిన్న వయసులోనే 150కి పైగా చిత్రాల్లో కనిపించారు. రోజూ ఏదో ఒక షూటింగ్ ఉండేది. చదువు అటకెక్కుతుందన్న భయంతో షూటింగ్ గ్యాప్లో చదువుకునేవారు.

అలా తర్వాత ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. కొన్నాళ్లపాటు ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేనేజర్గా పని చేశారు.

తర్వాత ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బిగ్బాస్, మెకానిక్ అల్లుడు, పెళ్లి సందడి, చెప్పవే చిరుగాలి, మగరాయుడు..

ఇలా దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత.. ఇలా ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన కమెడియన్ కూడా ఈయనే!








