
శ్రీశైలంటెంపుల్: ఇలా కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో ఐదురోజులుగా కొనసాగుతున్న ఉగాది మహోత్సవాలు బుధవారం ముగిశాయి

చివరి రోజు మహోత్సవాలకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలోని మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూలస్నానం చేపట్టారు

శ్రీభ్రమరాంబాదేవి నిజాలంకరణలో దర్శనమివ్వగా, స్వామిఅమ్మవార్లు అశ్వవాహనంపై విహరించారు

అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగకార్యక్రమాన్ని పూర్తి చేశారు

పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిపించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని పసుపు, సున్నం, సుగంధద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు

















