
జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి

బ్రమ్మోత్సవాలలో భాగంగా ఈరోజు నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ,రామలింగేశ్వర స్వామి, మువ్వురు స్వాముల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముందు స్వామీ వార్ల ఉత్సవ మూర్తులను రథం పై ఆశీనులును చేసి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వార్లను దర్శనం చేసుకున్నారు

ఆలయం నుండి ధర్మపురి పురవీధుల గుండా రథాలను నంది చౌరస్తా వరకు వెళ్లి తిరిగి ఆలయం వద్దకు తీసుకువచ్చారు

రథోత్సవం తిలకించటానికి వేల సంఖ్యలో భక్తులు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రథోత్సవాన్ని తిలకించడానికి తరలివచ్చారు ధర్మపురి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయు

















