breaking news
-
సంచలన నిజాలు బయటపెట్టిన అప్పటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
-
వెంకటాయపాలెం : 1996 శిరోముండనం కేసులో కీలక తీర్పు
సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాడి కేసులో మాత్రం మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. నిందితులకు అట్రాసిటీ కేసులో 18 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 42,000 రూపాయల చొప్పున 3,78,000 జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్లపాటు వివిధ కోర్టుల్లో కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరగ్గా.. ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. కోర్టు దోషులుగా గుర్తించిన పది మందిలో రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులు ఒకరు. నేరం జరిగినప్పుడు త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉండగా డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. వెంకటాయపాలెంలో అయిదుగురు దళితులను చిత్రహింసలు పెట్టారని, వారికి శిరోముండనం చేశారని కేసు నమోదయింది. భారతీయ శిక్షాస్మృతి 342, 324, 506 లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 లతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 28 ఏళ్ల పాటు విచారణ జరిగి ఈ రోజు తుది తీర్పు వెలువడింది. తోట త్రిమూర్తులు భవితవ్యమేంటీ? 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం1995లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 2024లో జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయనున్నారు. తొలుత శిక్ష విషయంపై ఆందోళన చెందినా.. కోర్టు 18 నెలల జైలు శిక్ష మాత్రమే విధించడంతో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులుతో సహా నిందితులందరూ దరఖాస్తు చేసుకున్నారు. నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి వారికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. చట్టాన్ని గౌరవిస్తాను చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత, ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను, అందుకే గడువు కోసం బెయిల్ విజ్ఞప్తి చేయగా... కోర్టు అంగీకరించింది : తోట త్రిమూర్తులు -
ఎంపీ సీటు కోసం GVL వదలని పట్టు.. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి..
-
వైజాగ్లో పురందేశ్వరికి బిగ్ షాక్..!
-
ధోనినా మజాకా.. చెవులు చిల్లులు పడేలా చేశాడు.. కోహ్లి కూడా అంతే..!
విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు పొట్టి ఫార్మాట్లోని పూర్తి మజాను ఆస్వాదించారు. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలాకాలం తర్వాత సూపర్ మ్యాన్ ఇన్నింగ్స్ ఆడటంతో విశాఖ ప్రేక్షకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. NOT IN CHEPAUK!!!! pic.twitter.com/JYZv3gzvuu — CricTracker (@Cricketracker) March 31, 2024 ధోని తొలి బంతికే బౌండరీ కొట్టినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో చెవులు చిల్లులు పడే స్థాయిలో 128 డెసిబుల్స్ సౌండ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సీజన్లో ఇంతటి సౌండ్ నమోదు కావడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేసినప్పుడు కూడా ఇంతే స్థాయిలో (128 డెసిబుల్స్) శబ్దాలు నమోదయ్యాయి. Highest peak Roars for any player in this IPL 2024: 128 DB - When Virat Kohli completed fifty at chinnaswamy. 128 DB - When MS Dhoni hits First boundary. - Two GOATs, Two Brands of World Cricket. 🐐 pic.twitter.com/GYL002yRET — CricketMAN2 (@ImTanujSingh) April 1, 2024 కాగా, విశాఖ మ్యాచ్లో ధోని చెలరేగినప్పటికీ సీఎస్కే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని లేటుగా క్రీజ్లోకి రావడంతో సీఎస్కే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పృథ్వీ షా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రిషబ్ పంత్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పతిరణ 3 వికెట్లతో రాణించాడు. VINTAGE MS DHONI AT VIZAG...!!!! Raina & Aakash commentary - "Mahi Maar Raha Hai". ❤️ pic.twitter.com/hoUihqM4mp — CricketMAN2 (@ImTanujSingh) March 31, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. ఖలీల్ అహ్మద్ (4-1-21-2), ముకేశ్ కుమార్(3-0-21-3), అక్షర్ పటేల్ (3-0-20-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్ (1),రచిన్ రవీంద్ర (2), సమీర్ రిజ్వి (0) విపలం కాగా.. రహానే (45), డారిల్ మిచెల్ (34) పర్వాలేదనిపించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (21 నాటౌట్), ధోని చెలరేగిప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది తొలి ఓటమి కాగా.. ఢిల్లీ బోణీ కొట్టింది. The Roar when MS Dhoni hits First Six of this IPL 2024. - Dhoni is an emotion, He's beyond everything...!!!!! 🐐 pic.twitter.com/t5H2GhZ8if — CricketMAN2 (@ImTanujSingh) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019