breaking news
-
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి (ఫొటోలు)
-
చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Live Updates.. కొప్పేర్ల చేరుకున్న సీఎం జగన్ సార్ బస్సు యాత్ర భోగాపురం క్రాస్ అయిన సీఎం జగన్ చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ విజయనగరం జిల్లా సిద్ధం విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహా సముద్రం కనిపిస్తోంది ఒక్కసారిగా లక్షలమంది, తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచిచూపించడానికి నా ఉత్తరాంద్ర సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వాతాతలకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్ను, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్ను, పిల్లల భవిష్యత్ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా, అడ్డుతగులుతున్న పెత్తందార్లు మీద, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్ ఉంది, ఓ బీజేపీ ఉంది.. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు.. చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఓ దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5 ఉంది. ఇవి సరిపోవన్నుట్లుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయి ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఈ రోజు మీ జగన్ వెనకాల ఆ యెల్లో మీడియా లేదు.. ఆ పార్టీలు లేవు.. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకం అవుతా ఉన్నారు జగన్ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే, ప్రతీ ఇంట్లోను జగన్ను బిడ్డ గా, తమ్ముడిగా భావించకపోతే.. ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను జగన్ ఒకే ఒక్కడు కాదు.. నాకున్నది కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నాను ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ.. ఇంటింటికి చేసిన మంచే నాకున్న నమ్మకం.. ఆపై పైనున్న దేవుడి దయ ప్రతీ వర్గానికి మంచి చేశాం.. న్యాయం చేశాం మనం.. మోసం చేసింది మాత్రం వారు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. పేదల్ని ఓడించాలని వారు.. ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చార్మిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న ఆ బాబుకు , ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరతా ఉన్నాను వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం ఎన్నికలప్పుడు మోసం చేసి, మోసపూరిత చరిత్ర ఉన్న ఆ మూడు పార్టీల కూటమిని ఏమనాలి అని అడుగుతున్నాను ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఆ తర్వాత మోసం చేస్తే.. అలాంటి మోసగాళ్లను ఏమంటాం అలాంటి వాళ్లను 420లు అందామా... వారిని 420లనే అంటాం మళ్లీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం 420 అనే కాదు.. చంద్రముఖి బృందం అని కూడా అంటాం పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా 40 స్కీమ్స్ పెట్టాం మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే.. ఏకంగా మరో లక్ష కోట్లకు పైగానే ఇచ్చాం నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్ను.. నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇది కేవలం 58 నెలల కాలంలోనే పంపడం జరిగింది నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడులకు పంపలేని పరిస్థితిని నేను నా ఓదార్పుయాత్రలో చూశాను.. నా పాదయాత్రలోనూ చూశాను అలాంటి నిరుపేద కలల్నినిజం చేయడానికే పుట్టింది.. జగనన్న అమ్మ ఒడి అని గర్వంగా చెబుతున్నాను. అంతే కాకుండా ఆ పేద తల్లి తమ పిల్లల గొప్ప భవిష్యత్కు కోసం కనే కలలు గురించి అర్ధం చేసుకున్నాను కాబట్టే ఒక నాడు నాడు, ఒక ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఒక సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, బైజూస్ కంటెంట్, ఆరోతరగతి నుంచే డిజిటల్ బోధనలు, ఎనిమిదో తరగతి వచ్చేసరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్... ఇలా ఎంతో సంక్షేమాన్ని తీసుకొచ్చాం ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి విద్యా దీవెన, వసతి దీవెన ప్రవేశపెట్టాం ఒక డిగ్రీలో కరిక్యులమ్లో మార్పులు తీసుకొస్తూ.. విదేశీ విద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను మన డిగ్రీలతో అనుసంధానం చేశాం మన డిగ్రీల్లో మ్యాండెటరీ ఇంటర్నెషిప్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్.. వాటి నుంచి వచ్చినవే ఈ నా స్కీమ్స్ మరి వీటి గురించి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఆలోచనైనా చేశాడా అని అడుగుతున్నాను మరి ఈ ఆలోచనలు చంద్రబాబుకు ఎందుకు రాలేదంటే.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు.. పేదల రక్తాన్ని తాగేందుకు లకలకాని తపిస్తాడు కాబట్టి ప్రతీ అక్క చెల్లెమ్మకు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఒక కల ఉంటుంది. కుటుంబం బాగుండాలని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కలలు కంటుంది. ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి తోడుగా ఉండాలని కలలుకంటుంది. మరి అటువంటి కలలు కన్న వారి కోసం ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చామో చూద్దామా.. ఓ వైఎస్సార్ ఆసరా పథకం, ఓ వైఎస్సార్ సున్నా వడ్డీ అనే పథకం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారు నిలదొక్కుకునేలా ఉండేందుకే పుట్టిందే వైఎస్సార్ చేయూత అనే పథకం నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది.. కాపునేస్తం అనే పథకం నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఈబీసీ నేస్తం అనే పథకం అక్క చెల్లెమ్మల డ్రీమ్స్ను.. వాటిని నిజం చేయడానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి అని చెబుతున్నాను డ్రీమ్స్ పేదింటి అమ్మవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అని గర్వంగా చెబుతున్నాను చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్ లేవు. చంద్రబాబు హయాంలో నా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచించి రోడ్డు మీద పడేసి వారి రక్తాన్ని పీల్చే చంద్రముఖి పాలన మాత్రమే చూశాం. ప్రతీ అక్క చెల్లెమ్మ కలకంటుంది. సొంత ఇల్లు ఉండాలని కలలు కంటుంది. దీని కోసం జీవితకాలం ఎదురుచూస్తాం. మరి ఆ డ్రీమ్ను నెరవేరుస్తూ మీ బిడ్డ ఏం చేశాడు నా అక్క చెల్లెమ్మల పేరిటి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. డ్రీమ్ మీవి.. స్కీమ్ మీ బిడ్డవి, మీ తమ్ముడివి, మీ అన్నవి చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయండి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చుకానీ బాబును నమ్మలేం నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్ది.. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి చెల్లూరు బహిరంగ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ అశేష జనవాహినితో నిండిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: చెల్లూరు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: కాసేపట్లో చెల్లూరు బహిరంగ సభ వద్ద చేరుకోనున్న సీఎం జగన్ చెల్లూరు సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజలు మేమంతా సిద్ధమంటూ హోరెత్తుతున్న ఉతర్రాంధ్ర విజయనగరం: ఐనాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు రోడ్లకు ఇరువైపులా జన ప్రభంజనం ఐనాడుకు కొద్దీ దూరంలోనే జరగనున్న సిద్ధం సభ. విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ 21 రోజు బస్సుయాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయనగరం జిల్లా ఎంట్రన్స్లో సీఎం జగన్ బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ నేతలు పదిహేను వందల బైక్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.. ప్రజలు పువ్వులతో స్వాగతం పలుకుతూ హారతులతో ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు సీఎం జగన్ భరోసా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశం సైబర్ క్రైమ్లో ఫిర్యాదుతో పాటు పార్టీ నుంచి న్యాయ సహాయం దాడులకు భయపడేది లేదు దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి నా చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్ ఇటు వైపు జగన్ ఒక్కడే.. అటు వైపు కూటమితో ఏకమయ్యారు మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం అబద్ధాలు,మోసాలతో యుద్ధం చేస్తున్నాం గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారు టీడీపీ ఎంత దిగజారిందో దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనం సోషల్ మీడియా మనతోనే ఉంది సెల్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ మనతోనే ఉన్నారు విశాఖపట్నం ఏపీకి డెస్టినీ అవుతుంది ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు. మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు. ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు. మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ.. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో స్వాగతం పలికిన ప్రజలు బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం జగన్ విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను నివేదించిన కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది: సీఎం జగన్ ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది: తొలిసారిగా ప్రధానికి లేఖ రాశాం స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైఎస్సార్సీపీకే ఉంది పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను: సీఎం జగన్ 21వరోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎండాడ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాసేపట్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి సాయంత్రం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ పీఎంపాలెం వద్ద కోలాహలం పీఎంపాలెం వైయస్సార్ స్టేడియం వద్ద సందడి వాతావరణం.. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం(ఏప్రిల్ 23) షెడ్యూల్ సీఎం జగన్ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు ఇదీ చదవండి: ఓ విజేత జైత్రయాత్ర Memantha Siddham Yatra, Day -21. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభ అక్కివలస దగ్గర రాత్రి బస#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/IAQvjd6MPK — YSR Congress Party (@YSRCParty) April 23, 2024 జననేతకు అడుగడుగునా జన నీరాజనం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర.. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు తమ బతుకుల్లో వెలుగులు నింపిన నేతకు అడుగడుగునా జన నీరాజనం రాయలసీమ.. దక్షిణ కోస్తా.. ఉత్తర కోస్తా.. ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం మండుటెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జనసంద్రాలను తలపించిన వైనం కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలు అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక.. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం యాత్ర బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షంగా మారిందంటున్న రాజకీయ పరిశీలకులు -
జగన్ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. వైఎస్సార్సీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఈ కోటకు బీటలు వారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, ఈ ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి, పలు ఐటీ కంపెనీల ఏర్పాటు, బడుగు బలహీనవర్గాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ ఇక్కడ కకావికలైంది. ఆ పార్టీకి కార్యకర్తలూ చేజారిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. దీంతో పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. దీంతో ఓ నియోజకవర్గం.. వంద గ్రూపుల్లా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఈ గ్రూపుల మధ్య సంక్రాంతికి ముందే కోళ్ల పందేలకు దీటుగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. యువగళం ముగింపు సభకు జనసమీకరణ కోసం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. యువగళం సభకు వచ్చేది లేదని ఆయనకు తేల్చి చెప్పినట్టు సమాచారం. గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు. గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవలి వరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు మృగ్యమైపోవడంతో ఆయన భీమిలి వైపు చూస్తున్నారు. భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు. ఇది భీమిలి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబుకు మింగుడుపడటం లేదు. ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటాను నమ్మరంటూ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. భీమిలిలోనే కాదు.. గంటా శ్రీనివాసరావు పాయకరావుపేట నియోజకవర్గంలోనూ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలోనూ ఆయన జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీని కూడా సాగనంపి.. ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లిలో అయ్యన్న కినుక అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించేకొద్దీ అయ్యన్న వర్గం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా, మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు. మాడుగులలో మూడు ముక్కలాట మాడుగుల నియోజకవర్గం టీడీపీలో మూడు పందెం కోళ్లు కొట్టుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి పీవీజీ కుమార్తో పాటు రామనాయుడు, పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని, ఆయనకు మాడుగులలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే మాడుగుల బరిలో నలుగురు ఉన్నట్టే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్టు దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదు. అరకు నియోజకవర్గం ఇన్చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతోంది. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
సాక్షి, తణకు(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష్, ఎంపీ భరత్లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్లు పాల్గొన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్మోర్’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019